News March 16, 2024
త్యాగమూర్తి పొట్టిశ్రీరాములు జయంతి నేడు

స్వభాషారాష్ట్రం కోసం ఆత్మార్పణకు పూనుకొన్న యోధుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం 1952 OCT 10 నుంచి 58 రోజుల పాటు ఆయన మద్రాస్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అసువులు బాసి అమరజీవి అయ్యారు. ఆయన ధీరోదాత్త ఆత్మత్యాగ ఫలితమే ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర అవతరణ. 1953 OCT 1న కర్నూలు జిల్లా రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 2008లో నెల్లూరు జిల్లా పేరును శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.
Similar News
News October 20, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(PGIMER)లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/BDSతో పీహెచ్డీ, ఎంఎస్సీ నర్సింగ్, MD/MS, GNM, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://pgimer.edu.in/
News October 20, 2025
రాష్ట్రంలో తగ్గిన నూనె గింజ పంటల సాగు విస్తీర్ణం

AP: రాష్ట్రంలో ఈ ఏడాది నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగుచేయాలనుకోగా 6.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగతో పాటు ఇతర నూనెగింజల పంటలు సాగయ్యాయి. వరి 38.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి 11 లక్షల ఎకరాల్లో, చెరకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. మొక్క జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, కందులు, ఆముదం, జూట్ వంటి పంటలు లక్ష్యానికి మించి సాగయ్యాయి.
News October 20, 2025
సత్యభామలా ఆత్మస్థైర్యంతో ఉందాం..

నరకాసురుడితో యుద్ధం చేసి చంపడంలో శ్రీకృష్ణుడికి సత్యభామ సహకరిస్తుంది. మనలోని నిరాశ, అలసత్వం, పిరికితనం వంటి బలహీనతలను నరకసారుడిగా భావించి ధైర్యం, అప్రమత్తత, తెగింపు, ఆత్మస్థైర్యం, చురుకుదనంతో అతివలు పోరాడాలి. ఎక్కడ ప్రేమను చూపాలో, ఎక్కడ విజృంభించాలో తెలిసిన శక్తిస్వరూపుణి సత్యభామ. నేటితరం యువతులు ఆ గుణాలను ఆకళింపు చేసుకుంటే జయం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.
* స్త్రీమూర్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.