News February 4, 2025
నేడు వరల్డ్ క్యాన్సర్ డే!

కాన్సర్పై అవగాహన, దాని నివారణ, గుర్తింపు, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిని ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. భారతదేశంలో ఏటా సగటున 11 లక్షల మందికి ఇది సోకుతుండగా 2023లో 14.96లక్షల మందికి పైగా చనిపోయారు. రొమ్ము, గర్భాశయ, లంగ్, బ్లడ్, నోటి క్యాన్సర్ వంటివి ఎక్కువగా సోకుతున్నాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
Similar News
News March 30, 2026
జనగణన.. సహజీవన జంటలకు కుటుంబ హోదా

దేశంలో ఎల్లుండి నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్గా గుర్తిస్తామని పేర్కొంది. అందుకు ఎటువంటి ఆధారాలు అవసరం లేదని, కాకపోతే ఆ జంట అనుమతి తప్పనిసరని వెల్లడించింది. గతంలో పెళ్లికాని జంటలు తమను తాము వివాహితులుగా నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 33 ప్రశ్నలతో జనగణన సాగనుంది.
News March 30, 2026
ఏప్రిల్ 4వ వారంలో టెన్త్ ఫలితాలు

AP: టెన్త్ పరీక్ష ఫలితాలు APR 4వ వారంలో విడుదల చేసేందుకు SSC బోర్డు చర్యలు చేపట్టింది. APR2తో పరీక్షలు ముగుస్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం 6-15 తేదీ వరకు జరుగుతుంది. అనంతరం OMR స్కానింగ్ ఉంటుంది. ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్కు జిల్లాలను సంప్రదించడం, వాల్యుయేషన్ పత్రాల ర్యాండమ్ చెకప్ అనంతరం కంప్యూటరీకరణ చేస్తుంది. ఇవి పూర్తయ్యాక 30లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
News March 30, 2026
వాహనదారులకు షాక్.. పెరిగిన CNG ధర

TG: CNG వాహనదారులకు షాక్ తగిలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దిగుమతికి ఆటంకంతో సరఫరా మరింత తగ్గింది. ఇదే సాకుతో గ్యాస్ కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. 3 రోజుల క్రితం వరకు కిలోపై అదనంగా ₹1 చొప్పున వసూలు చేసిన HYDలోని ఓ PVT గ్యాస్ కంపెనీ ఆ తరువాత నుంచి మరో రూ.2 పెంచి విక్రయిస్తోంది. వారం కిందట ఈ ధర ₹96గా ఉండగా శనివారం నుంచి అన్ని బంకుల్లో KG ₹99 చొప్పున CNG స్టేషన్లలో వసూలు చేస్తున్నారు.


