News April 13, 2024

జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటితో 105 ఏళ్లు

image

జలియన్ వాలాబాగ్ కాల్పుల ఘటన భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది పంజాబ్‌లోని అమృత్‌సర్ ఉన్న ఒక తోట. 1919, ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు ఈ తోటలో సమావేశమైన ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కాల్పుల్లో 379 మంది మరణించారు. కానీ 1000 మంది చనిపోయారనే వాదనలున్నాయి.

Similar News

News October 11, 2024

తెలంగాణపై వివక్ష ఎందుకు?: హరీశ్‌రావు

image

తెలంగాణకు కేంద్రం మళ్లీ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘గోదావరి పుష్కరాల కోసం APకి రూ.100 కోట్లు ఇచ్చి, TGకి సున్నా ఇచ్చారు. 8 మంది BJP MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఒక్క రూపాయి సాధించలేదు. బడ్జెట్లోనూ TGకి 0 కేటాయించి, APకి ₹15,000 కోట్లు ఇచ్చారు. APకి ఇచ్చారని బాధ కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే మా ఆవేదన. TGని ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలి’ అని డిమాండ్ చేశారు.

News October 11, 2024

పనిచేయని Govt ఉద్యోగులకు డేంజర్ బెల్స్: వేటు వేయాలని మోదీ ఆదేశం

image

అవినీతిపరులు, పనిచేయని అధికారులపై వేటు వేయాలని యూనియన్ సెక్రటరీలను PM మోదీ ఆదేశించారు. రూల్స్ ప్రకారం వారి పనితీరును మూల్యాంకనం చేయాలని సూచించారు. అంచనాలను అందుకోని వారికి CCS రూల్స్‌లోని ఫండమెంటల్ రూల్ 56(j), రూల్ (48) ప్రకారం రిటైర్మెంట్ ఇచ్చేయాలని బుధవారం ఆదేశించినట్టు తాజాగా తెలిసింది. వీరికి 3 నెలల నోటీస్ లేదా వేతనం ఇస్తారు. ఈ రూల్స్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వం 500 మందిని ఇంటికి పంపేసింది.

News October 11, 2024

BREAKING: టాటా ట్రస్టు ఛైర్మన్‌గా నోయల్ టాటా

image

రతన్ టాటా మరణంతో టాటా ట్రస్టు ఛైర్మన్‌గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఓ ప్రకటన చేశారు. ఈయన రతన్‌కు వరుసకు సోదరుడు అవుతారు. ఇప్పటికే టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్, టాటా స్టీల్, టైటాన్ సంస్థలకు వైస్‌ఛైర్మన్‌గా నోయల్ వ్యవహరిస్తున్నారు.