News December 2, 2024
నేడు సీఎంతో పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

AP: ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం భేటీ కానున్నారు. రాజ్యసభ సీట్ల సర్దుబాటు, బియ్యం అక్రమ రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించిన పవన్ బియ్యం అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 2, 2026
MBNR: గుంపులుగా నాగుపాములు.. గ్రామంలో భయాందోళన

చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామం రెండవ వార్డులో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 నాగుపాములను స్థానికులు చంపారు. వార్డులో నివసిస్తున్న విశ్వనాధ్ ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాములు సంచారిస్తున్నాయని కాలనీవాసులు తెలిపారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. చంపబడిన వాటిలో చిన్న పాములు కూడా ఉండటం గమనార్హం.
News April 2, 2026
ఆర్టెమిస్-2: చంద్రుడి కక్ష్యలోకి స్మార్ట్ఫోన్లు..

NASA చేపట్టిన ఆర్టెమిస్-2 <<19542665>>యాత్ర<<>> రికార్డులు సృష్టిస్తోంది. ఇది అపోలో-13 కంటే 3,345 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించనుంది. అలాగే చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ చరిత్రకెక్కనున్నారు. రెండు మినీ వ్యాన్ల పరిమాణంలో ఉండే ఓరియన్ నౌకలో నలుగురు వ్యోమగాములు తమ వెంట స్మార్ట్ఫోన్లు తీసుకెళ్తుండటం విశేషం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వీరు నింగి నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించనున్నారు.
News April 2, 2026
ట్రంప్ ప్రకటన.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ <<19543167>>ప్రకటన<<>> నేపథ్యంలో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3 శాతం ఎగసి 103 డాలర్లుగా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.


