News September 15, 2024
నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News November 18, 2025
960 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TG: వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న కోర్టుల్లో 960 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో 23 అదనపు కోర్టు మేనేజర్ పోస్టులు, మరిపెడలో 27, హన్మకొండ, హుజూర్ నగర్, సుల్తానాబాద్, దేవరకద్ర, భీమగల్, సంగారెడ్డి, భూపాలపల్లిలో 196, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 617, 5 ఫస్ట్ క్లాస్ కోర్టుల్లో 97 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
News November 18, 2025
960 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TG: వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న కోర్టుల్లో 960 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో 23 అదనపు కోర్టు మేనేజర్ పోస్టులు, మరిపెడలో 27, హన్మకొండ, హుజూర్ నగర్, సుల్తానాబాద్, దేవరకద్ర, భీమగల్, సంగారెడ్డి, భూపాలపల్లిలో 196, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 617, 5 ఫస్ట్ క్లాస్ కోర్టుల్లో 97 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.


