News September 15, 2024
నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News October 8, 2025
కమిన్స్, హెడ్కు రూ.58 కోట్ల ఆఫర్!

ఆసీస్ క్రికెటర్లు కమిన్స్, హెడ్కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. AUSను వీడి తమ ఫ్రాంచైజీ తరఫున గ్లోబల్ T20 టోర్నీల్లో ఆడితే ఏడాదికి రూ.58.2 కోట్ల చొప్పున ఇవ్వజూపినట్లు వెల్లడించాయి. దీనికి ప్లేయర్లు అంగీకరించలేదని తెలిపాయి. కాగా AUS జట్టు ఏడాదికి ఈ ప్లేయర్లకు చెరో రూ.8.74 కోట్లు చెల్లిస్తోంది. దీనికి దాదాపు 7 రెట్లు IPL ఫ్రాంచైజీ ఆఫర్ చేయడం గమనార్హం.
News October 8, 2025
మెదడు సమస్య కాళ్లలో మొదలు: డాక్టర్

‘మెదడు మోకాళ్లలో ఉందా?’ అని అందరం అనే ఉంటాం కదా. కానీ డిమెన్షియా మోకాళ్లలో మొదలవుతుందని న్యూరో సర్జన్ డా. అరుణ్ L నాయక్ తెలిపారు. పలు శారీరక, మానసిక సమస్యలు కలిసిన వ్యాధి డిమెన్షియా అని ఆయన వివరించారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కాలి కండరాల్లో పటుత్వం పోయి మెదడుకు పంపాల్సిన కొన్ని కెమికల్స్ను నరాలు పంప్ చేయలేవు. ఫలితంగా బ్రెయిన్ ఆలోచన శక్తి తగ్గడం, మతిమరుపు తదితరాలు డిమెన్షియాకు దారితీస్తాయట.
News October 8, 2025
జీవ ఎరువుల వాడకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతు వాడే <<17939337>>జీవ ఎరువు<<>> ఆ పంటకు సరైనదై ఉండాలి. ఈ ఎరువు ప్యాకెట్లను నీడ ప్రదేశంలోనే నిల్వచేయాలి. ప్యాకెట్పై పేర్కొన్న గడువు తేదీలోపే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కలిపి జీవ ఎరువులు వాడరాదు. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవ ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. ఈ ఎరువులను తొలిసారి వినియోగిస్తుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకే వినియోగించాలి.