News September 15, 2024
నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News October 11, 2025
కాశీ సందర్శనకు తరలి వస్తున్న విదేశీయులు

పరమ పవిత్ర కాశీ నగరానికి విదేశీ భక్తులు తరలివస్తున్నారు. 2021లో కేవలం 2,566 మంది విదేశీయులు మాత్రమే కాశీని సందర్శించారు. ఆ సంఖ్య 2024 నాటికి 2.1 లక్షలకు పెరిగింది. 2025 జూన్ నెలలోనే 1.88 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పురాతన ఆలయాల గొప్పదనం విశ్వ నలుమూలలకు విస్తరిస్తోందని చెప్పడానికి సంకేతం. విదేశీయులు సైతం కాశీకి రావడం భారత ఆధ్యాత్మిక వారసత్వ విజయానికి నిదర్శనం!
News October 11, 2025
ట్రంప్ది ఉరకలేసే హృదయం

అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన అత్యంత వృద్ధుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. రెండోసారి బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 79 ఏళ్లు. కానీ ఆయన హృదయం మాత్రం 14 ఏళ్ల చిన్నదేనట. ట్రంప్ వైద్య పరీక్షల నివేదికను వైట్హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు. ఆయన గుండె, శరీరం వాస్తవ వయసుకన్నా తక్కువ ఉన్నట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలిందన్నారు. ఊపిరితిత్తులు, నాడులు, ఇతర అవయవాల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు చెప్పారు.
News October 11, 2025
CBSE స్కాలర్షిప్తో బాలికల చదువుకు ప్రోత్సాహం..

ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్షిప్ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయ్యి, పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. చివరితేదీ అక్టోబర్ 23. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు.
వెబ్సైట్: <