News September 15, 2024
నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Similar News
News November 12, 2025
దేశవాళీ ఆడాల్సిందే.. RO-KOకు బీసీసీఐ అల్టిమేటం?

కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని, లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని హిట్మ్యాన్ MCAకు సమాచారం అందించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. కోహ్లీ ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. T20, టెస్టులకు వీడ్కోలు పలికిన RO-KO వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
News November 12, 2025
సివిల్స్ ఫలితాలు విడుదల

ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన సివిల్ సర్వీసెస్(మెయిన్) ఎగ్జామినేషన్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2,736 మంది మెయిన్స్ క్లియర్ చేశారు. https://upsc.gov.in/, https://www.upsconline.gov.inలో ఎంపికైన వారి ర్యాంక్, పేర్లతో జాబితాను ఉంచారు. వీరికి పర్సనాలిటీ టెస్టు నిర్వహించి ర్యాంకుల ఆధారంగా IAS, IPS, IFS సహా పలు రకాల సెంట్రల్ సర్వీసెస్లు కేటాయిస్తారు.
News November 12, 2025
‘Mom my first love’.. టాటూ చూసి డెడ్బాడీ గుర్తింపు

ఢిల్లీ బ్లాస్ట్లో మరణించిన వారి డెడ్బాడీలను గుర్తించడం కష్టతరంగా మారింది. టాటూలు, టీ షర్టు ఆధారంగా తమ ఆత్మీయుల మృతదేహాలను గుర్తించారు. చాందినీ చౌక్లో ఫార్మా బిజినెస్ చేసే 34 ఏళ్ల అమర్ కటారియా బ్లాస్ట్లో మరణించాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అతని డెడ్బాడీని చేతిపై ఉన్న ‘Mom my first love’, ‘Dad my strength’ టాటూల ఆధారంగా సోమవారం రాత్రి మార్చురీలో కుటుంబసభ్యులు గుర్తించారు.


