News September 15, 2024

నేడు మహబూబ్‌ నగర్ జిల్లాకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Similar News

News October 10, 2025

రూ.10,896 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: వచ్చే మూడేళ్లలో రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో రూ.10,896 కోట్లతో 5,587kms మేర హ్యామ్ రోడ్లను వేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి HYDకు 4 లేన్ రోడ్లు వేస్తామని, యాక్సిడెంట్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు.

News October 10, 2025

నటుడు, బాడీబిల్డర్ వరీందర్ సింగ్ కన్నుమూత

image

నటుడు, బాడీబిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్(42) గుండెపోటుతో మరణించారు. పంజాబ్‌కు చెందిన ఆయన 2009లో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ గెలిచారు. మిస్టర్ ఏషియా పోటీల్లో రెండో స్థానం సాధించారు. 2012లో ‘కబడ్డీ వన్స్ అగైన్’ అనే పంజాబీ మూవీలో హీరోగా, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్బన్స్’, ‘మర్జావాన్’, సల్మాన్ ‘టైగర్-3’ మూవీలో నటించారు. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మృతిచెందారు.

News October 10, 2025

WPL ఆక్షన్ తేదీలు ఖరారు?

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలం నవంబర్ 25-29 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఒక్కో టీమ్ రూ.15కోట్ల పర్స్ కలిగి ఉంటాయని, 2025 స్క్వాడ్‌ నుంచి ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చని పేర్కొన్నాయి. నవంబర్ 5లోగా జట్ల యాజమాన్యాలు రిటెన్షన్స్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. 2023 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా ముంబై ఇండియన్స్ (2023, 25) రెండుసార్లు, RCB ఒకసారి (2024) విజేతగా నిలిచాయి.