News December 3, 2024

నేడు వరద నీటి సంపుల నిర్మాణం ప్రారంభం

image

TG: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు సచివాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి వరద నీటి సంపుల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల వరకు ఉండనుంది. వర్షాల సమయంలో వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Similar News

News December 25, 2025

SSCలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

image

SSCలో 326 గ్రేడ్-C స్టెనో‌గ్రాఫర్(LDCE) ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, హిందీ/ఇంగ్లిష్‌లో షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. CBTలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు స్టెనో‌గ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చే నెల 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు, అర్హత, అప్లికేషన్, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 25, 2025

ఇంటర్ సెకండియర్ HTపై ఫస్టియర్ మార్కులు

image

TG: ఇంటర్ సెకండియర్ పరీక్షల హాల్‌టికెట్‌‌పై ఇక నుంచి ఫస్టియర్ మార్కులు, పాస్/ఫెయిల్ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది. కొందరు విద్యార్థులు ఫస్టియర్ మార్కులు తక్కువొచ్చినా, సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా పేరెంట్స్‌కు చెప్పట్లేదు. రెండో ఏడాది చివర్లో ఇది తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్ పెట్టడంతో పాటు విద్యార్థుల్లో జవాబుదారీతనం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.

News December 25, 2025

నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

image

దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజాతశత్రువు అటల్ బిహారి వాజ్‌ పేయి. ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్నా ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం ఆయనది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య చతురత మేళవించిన ప్రసంగాలు, ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు. రోడ్లతో పాటు ఎయిర్, రైల్, టెలీ, షిప్ కనెక్టివిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ‘భారతరత్న’ అయ్యారు. ఇవాళ వాజ్‌పేయి జయంతి.