News December 3, 2024

నేడు వరద నీటి సంపుల నిర్మాణం ప్రారంభం

image

TG: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు సచివాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి వరద నీటి సంపుల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల వరకు ఉండనుంది. వర్షాల సమయంలో వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Similar News

News October 16, 2025

సృష్టిలో శివ-శక్తి స్వరూపం

image

శివలింగాలు ప్రధానంగా 2 రకాలు. అవి స్థావరలింగం, జంగమ లింగం. చెట్లు, లతలు స్థావర లింగాలు కాగా, క్రిమి కీటకాదులు జంగమ లింగాలు. స్థావర లింగాన్ని నీరు పోసి సంతోషపెట్టాలి. జంగమ లింగాన్ని ఆహార వస్తువులతో తృప్తిపరచాలి. ఇదే నిజమైన శివ పూజ. సర్వత్రా ఉన్న పీఠం దేవి స్వరూపం. లింగం సాక్షాత్తూ చిన్మయ స్వరూపం. ఇలా సృష్టిలోని ప్రతి అంశంలోనూ శివ-శక్తి స్వరూపాన్ని గుర్తించి, సేవించడమే ఉత్తమ పూజా విధానం. <<-se>>#SIVOHAM<<>>

News October 16, 2025

రాష్ట్రంలో 218 పోస్టులు… అప్లై చేశారా?

image

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌ 218 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 97 ఉండగా, ఫ్యాకల్టీ పోస్టులు 121 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ నెల 21, ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 26 దరఖాస్తుకు ఆఖరు తేదీ. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/

News October 16, 2025

జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదు: సీబీఐ

image

AP: విదేశీ పర్యటనకు వెళ్లిన YCP చీఫ్ జగన్ తన సొంత ఫోన్ నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలు ఇవ్వాలనే షరతులను జగన్ ఉల్లంఘించారని HYD సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.