News July 6, 2024

నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

Similar News

News October 5, 2024

నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

image

సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి N-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు.

News October 5, 2024

Project Flower గురించి తెలుసా?

image

ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధానికి దిగిన ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఒకప్పుడు పరస్పరం సహకరించుకున్నాయి. సైనిక సహకారం కోసం Project Flower పేరుతో 1977లో ఇరాన్-ఇజ్రాయెల్ కలసి పనిచేశాయి. నాటి ఇరాన్ షా మొహమ్మద్ రెజా రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ భారీగా అయిల్ వనరులు పొందింది. అయితే, ఈ ప్రాజెక్టు 1979లో Iranian Revolution- 1979 కారణంగా అర్ధాంతరంగా ముగిసింది.

News October 5, 2024

‘రాజా సాబ్‌’ టీమ్‌కు ప్రభాస్ సూచన?

image

మారుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆయన లైనప్‌లో సలార్-2, స్పిరిట్, హను-ప్రభాస్, కన్నప్ప సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులోపే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీమ్‌కు ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మెజారిటీ షూట్ పూర్తయిన నేపథ్యంలో త్వరగానే మిగతా షూట్ కూడా కంప్లీట్ కావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి..