News March 22, 2025
TODAY TOP STORIES

* ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు
* చెన్నై చేరుకున్న రేవంత్, కేటీఆర్
* BRS వల్ల ఒక జనరేషన్ నాశనం: భట్టి
* సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ
* పోసానికి బెయిల్ మంజూరు
* మంత్రి ఫరూక్ ఇంట తీవ్ర విషాదం
* తెలంగాణలో గాలి, వాన బీభత్సం
* ఆరోజు ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు: చిరు
* న్యూజిలాండ్పై పాకిస్థాన్ స్టన్నింగ్ విన్
Similar News
News March 22, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. కాగా, రెండు రోజుల్లోనే వెండీ ధర ఏకంగా రూ.4100 తగ్గడం విశేషం.
News March 22, 2025
సైబర్ నేరగాళ్లకూ టార్గెట్.. ఛేదించకపోతే నరకమే!

ఉద్యోగాల కోసం ఏజెంట్ ద్వారా మయన్మార్, థాయ్లాండ్కు వెళ్లి సైబర్ ముఠా వలలో చిక్కుకున్న 589 మంది భారతీయులను కేంద్రం రక్షించింది. సైబర్ క్రైమ్స్ చేయడమే ఆ ఉద్యోగమని తెలియక అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘వీసా లాక్కుంటారు. టార్గెట్స్ చేరుకోకపోతే ఎండలో 4కి.మీలు పరిగెత్తిస్తారు. పుష్అప్స్ చేయిస్తారు. పాడైపోయిన బాతు గుడ్లు తినిపిస్తారు’ అని తెలంగాణకు చెందిన ఓ బాధితుడు BBCతో చెప్పారు.
News March 22, 2025
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాయలసీమలో, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు నిన్న రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో వడగాలులు వీచాయి.