News March 20, 2025
ఇవాళ్టి AP న్యూస్ రౌండప్

* నేటితో ముగియనున్న MLA, MLCల క్రీడాపోటీలు
* అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు ఈ-లాటరీ
* విశాఖలో నిరసనలకు వైసీపీ పిలుపు
* అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగింపు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై తుది విచారణ
* తిరుపతి తొక్కిసలాట ఘటన.. CVSO శ్రీధర్ను విచారించనున్న కమిషన్
Similar News
News March 20, 2025
ఈ అవార్డుతో నా హృదయం ఉప్పొంగింది: చిరు

UK పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో పార్లమెంట్ సభ్యులు, మంత్రుల నుంచి అవార్డు అందుకోవడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మరింత శక్తితో నా పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. నా ప్రయాణంలో తోడున్న, నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News March 20, 2025
OFFICIAL: చాహల్, ధనశ్రీ విడాకులు

భారత క్రికెటర్ చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్పై ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. దీనికోసం ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. అందులో కొంత మొత్తాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ తీర్పు కోసమే చాహల్ IPL జట్టులో ఇంకా చేరకుండా ఉన్నారు.
News March 20, 2025
చంద్రబాబు SC వర్గీకరణ రూపకర్త: పవన్ కళ్యాణ్

AP: SC వర్గీకరణకు CM చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాంది పలికిన చంద్రబాబుకు ధన్యవాదాలని అసెంబ్లీలో చెప్పారు. ‘ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ బిల్లుకు మనస్ఫూర్తిగా ఆమోదం పలుకుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు, మందకృష్ణే కారణం. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే’ అని ఆయన పేర్కొన్నారు.