News August 9, 2024

నేటి ముఖ్యాంశాలు

image

☞ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు
☞ ఇది తరాలపాటు గుర్తుండే విజయం: ప్రధాని మోదీ
☞ ఏపీలో జన్మభూమి కార్యక్రమాలు: TDP
☞ కర్ణాటకతో AP ప్రభుత్వం ఒప్పందాలు
☞ CM రేవంత్ US పర్యటనలో పెట్టుబడులపై ఒప్పందాలు
☞ TG: రేషన్ కార్డులపై సబ్ కమిటీ ఏర్పాటు
☞ కీలక వడ్డీరేట్లలో మార్పులు చేయని RBI
☞ JPCకి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు
☞ రిటైర్మెంట్ ప్రకటించిన రెజ్లర్ వినేశ్ ఫొగట్

Similar News

News March 14, 2026

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్!

image

TG: హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యే రీజినల్ రింగురోడ్డు వెంబడే రీజినల్ రింగ్ రైల్ (RRR) ఏర్పాటుకానుంది. దీని DPR కోసం సర్వేకి అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ లోక్‌సభలో MP కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్, ఆర్థికశాఖ అనుమతి తరువాత దీనికి తుది అనుమతి లభించనుంది. దీనివల్ల HYD చుట్టూ ఉన్న ప్రాంతాలకు రవాణా సులభం అవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది.

News March 14, 2026

OTP పద్ధతిలోనే సిలిండర్: పయ్యావుల

image

AP: రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లో ఉండాలని ఏజెన్సీలకు స్పష్టం చేశామన్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా OTP పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెరగకుండా చూస్తున్నామన్నారు. అధిక ధరలు వసూలు చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

News March 14, 2026

పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారా?

image

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.