News May 26, 2024
నేటి ముఖ్యాంశాలు

* ముగిసిన 6వ దశ పోలింగ్.. 60.38% ఓటింగ్ నమోదు
* బలమైన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరం: మోదీ
* TG: కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
* ఉద్యోగాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధం: కేటీఆర్
* గుజరాత్లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి
* IPL: రేపు SRH, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్
* అమెరికాకు బయల్దేరిన భారత జట్టు
Similar News
News October 11, 2025
నాకేం తొందర లేదు.. సీఎం మార్పు వార్తలపై డీకే శివకుమార్

కర్ణాటకలో సీఎం మార్పు వార్తలపై Dy.CM డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తొందరేం లేదని, తన తలరాత ఏంటో తనకు తెలుసని అన్నారు. ‘నేను సీఎం అయ్యేందుకు సమయం ఆసన్నమైంది’ అని తాను అన్నట్లు వార్తలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు నిజాలను వక్రీకరించి సెన్సేషనలిజం, పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా నవంబర్లో సర్కారులో మార్పులొస్తాయని ఊహాగానాలు సాగుతున్నాయి.
News October 11, 2025
రేపు ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ CLSకు శంకుస్థాపన

AP: మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖలో సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఇండియాతో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ CLS వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్గా పనిచేయనుంది.
News October 11, 2025
పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ లక్ష్యాలివే..

పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రధాని మోదీ పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ను ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం కింద 2030-31 నాటికి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 275 నుంచి 310 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే కేంద్రం లక్ష్యం. పప్పు ధాన్యాల ఉత్పత్తి 242 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం, హెక్టారుకు పంట ఉత్పాదకత 881 KGల నుంచి 1,130 KGలకు పెంచడం కేంద్రం లక్ష్యం.