News October 16, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: దామగుండంలో రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్
* గురుకులాలను వెంటనే తెరవకపోతే చట్టపరమైన చర్యలు: మంత్రి పొన్నం
* గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
* ఏపీ జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల ప్రకటన
* కూటమి ప్రభుత్వం మూడేళ్లే ఉంటుంది: కాకాణి
* వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక: AICC
* మహారాష్ట్రలో నవంబర్ 20న, ఝార్ఖండ్‌లో NOV 13, 20వ తేదీల్లో పోలింగ్

Similar News

News December 8, 2025

బరువు తగ్గాలంటే వీటిని ట్రై చేయండి!

image

బరువు తగ్గాలనుకునేవారికి డ్రైఫ్రూట్స్ సాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘బాదం తీసుకుంటే వాటిలోని ఫైబర్, కొవ్వుల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆక్రోట్‌లలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకలి తగ్గుతుంది. భోజనానికి ముందు గుప్పెడు పల్లీలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఖర్జూరాల వల్ల అధిక శక్తి అంది త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.

News December 8, 2025

TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

image

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

News December 8, 2025

నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

image

జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్‌షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడతారు.