News January 24, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటన
* తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం
* ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్
* టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్‌దే: అచ్చెన్నాయుడు
* మే నెలలో ‘తల్లికి వందనం’: డీబీ వీరాంజనేయ స్వామి
* దావోస్ ఖర్చెంత? పెట్టుబడులు ఎన్ని?: అంబటి
* మూడో రోజూ సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ సోదాలు

Similar News

News October 20, 2025

ఇదేం ఆట.. టీమ్ ఇండియాపై ఫ్యాన్స్ ఫైర్

image

వరల్డ్ కప్-2025: ఇంగ్లండ్‌పై భారత మహిళల టీమ్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 30 బంతుల్లో 36 రన్స్ చేయాల్సి ఉండగా 6 వికెట్లు చేతిలో ఉన్నాయని, అయినా గెలవలేకపోయిందని మండిపడుతున్నారు. ఇలాంటి ఆటతీరుతో భారత్ WC నెగ్గడం కష్టమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గత 3 మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అటు AUS, దక్షిణాఫ్రికా, ENG సెమీస్ చేరాయి.

News October 20, 2025

చంద్రబాబూ.. మీది ఏ రాక్షస జాతి: YCP

image

AP: 2019-24 మధ్య రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పట్టిపీడించాడని CM చంద్రబాబు చేసిన <<18052970>>వ్యాఖ్యలపై<<>> YCP మండిపడింది. ‘చంద్రబాబు గారూ.. మీరు ఏ రకం రాక్షస జాతికి చెందిన వారు. ఎందుకంటే వరుసగా రెండుసార్లు 2004, 2009లో ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించారు. 2019లోనూ మట్టికరిపించారు. అసలు మీరు CM పీఠంలోకి వచ్చిందే.. NTR గారిని వెనక నుంచి పొడిచి. ఇది ఏ రాక్షసజాతి లక్షణం అంటారు’ అని ట్వీట్ చేసింది.

News October 19, 2025

WWC: ఉత్కంఠ పోరులో భారత జట్టు ఓటమి

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 284/6 రన్స్‌కు పరిమితమైంది. స్మృతి మంధాన 88, హర్మన్ ప్రీత్ 70, దీప్తి శర్మ 50 రన్స్‌తో రాణించారు. సులభంగా గెలిచే అవకాశాలున్నా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి, బౌండరీలు బాదకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.