News April 11, 2025
నేటి ముఖ్యాంశాలు

* TG:‘యంగ్ ఇండియా స్కూల్’ నా బ్రాండ్: సీఎం రేవంత్
* రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల
* మరో 6 నెలల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్: మంత్రి శ్రీధర్ బాబు
* 30 లక్షల మందికి రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
* AP: నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి సత్యకుమార్
* గోడకు కొట్టిన బంతిలా ప్రతిచర్య తప్పదు: జగన్
* వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు
Similar News
News October 31, 2025
విశాఖపట్నం పోర్టులో 58 పోస్టులు

విశాఖపట్నం పోర్ట్ 58 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్/ డిప్లొమా అర్హతగల అభ్యర్థులు NOV 1 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 27, టెక్నీషియన్ అప్రెంటిస్లు 31 ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు నెలకు రూ.9వేలు, టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: vpt.shipping.gov.in
News October 31, 2025
రూ.కోట్లు కుమ్మరించినా చుక్క వర్షం పడలేదు

కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) ఫ్లాప్ అయింది. ఇప్పటివరకు 3 ట్రయల్స్ నిర్వహించగా చుక్క వర్షం కూడా కురవలేదు. ఒక్కో ట్రయల్కి రూ.35.67 లక్షల చొప్పున రూ.1.07 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 9 ట్రయల్స్ కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. లో సక్సెస్ రేట్ ఉన్న ఈ విధానానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.
News October 31, 2025
వాడని సిమ్స్ను డియాక్టివేట్ చేయండిలా!

చాలామంది ప్రస్తుతం ఒక సిమ్ మాత్రమే వాడుతున్నా ఆధార్ కార్డుపై ఎక్కువ సిమ్స్ యాక్టివ్లో ఉంటున్నాయి. ఇలాంటి అనవసరమైన సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకొని, వాటిని క్యాన్సిల్ చేసేందుకు ‘TAFCOP’ పోర్టల్ అందుబాటులో ఉంది. మొబైల్ నం. & ఆధార్తో లాగిన్ అయి సిమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అనవసరమైన వాటి డియాక్టివేషన్కు రిక్వెస్ట్ చేయొచ్చు.


