News November 23, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: నవంబర్ 23, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5:09
సూర్యోదయం: ఉదయం 6:25
దుహర్: మధ్యాహ్నం 12:03
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.56
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News November 19, 2025
ఖమ్మం: మార్చురీలో శవాలపై కక్కుర్తి వసూళ్లు

శవాలపై పేలాలు ఏరుకోవడం అనే డైలాగ్ వినే ఉంటాం. ఇలాంటి ఘటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ సిబ్బంది వ్యవహారంతో స్పష్టంగా కనిపిస్తుంది. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అప్పగించేందుకు రూ.3-5 వేల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఏడాదికి 1000కి పైగా మృతదేహాలు వస్తున్న నేపథ్యంలో ఈ దందాపై వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News November 19, 2025
ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.
News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


