News March 18, 2024
GHMCలో నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News February 3, 2026
ట్రెసా క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) 2026 నూతన క్యాలెండర్, డైరీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్వో సంగీతతోపాటు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జనార్దన్ఋరావు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
News February 2, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, పరీక్షల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పనులు పూర్తి చేయాలన్నారు.
News February 1, 2026
రంగారెడ్డి: నూతన సర్పంచుల శిక్షణా షెడ్యూల్లో మార్పులు

ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా తరగతుల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మున్సిపాల్ ఎన్నికల కారణంగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. మూడో విడత శిక్షణ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు, నాల్గో విడత ట్రైనింగ్ మార్చి 2 నుంచి 7 వరకు, ఐదో విడత శిక్షణ మార్చి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. అప్పటివరకు సర్పంచులు గ్రామాభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలన్నారు.


