News March 18, 2024
నేటి స్పందన కార్యక్రమం రద్దు: బాపట్ల ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710656594514-normal-WIFI.webp)
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై, ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ను నేడు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి పోలీస్ కార్యాలయానికి ప్రజలు రావద్దని కోరారు.
Similar News
News July 5, 2024
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి ప్రాణదానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720162506569-normal-WIFI.webp)
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకొచ్చారు. మంగళగిరికి చెందిన న్యాయవాది ప్రసాద్కు 2రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా NRI ఆసుపత్రికి తరలించారు. కాగా వైద్యులు ప్రసాద్కు బ్రెయిన్ డెడ్గా నిర్థారించారు. అతని అవయువాలను శుక్రవారం మధ్యాహ్నం NRI నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తిరుపతికి తరలించనున్నారు.
News July 5, 2024
గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720134589582-normal-WIFI.webp)
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న పురుగు మందు తాగాడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.
News July 5, 2024
గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720134589582-normal-WIFI.webp)
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడన్నారు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న గడ్డి మందు తాగడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.