News March 24, 2025

నేటి పాలకులు బ్రిటిష్ వారి కంటే అధ్వానం: కేజ్రీవాల్

image

భగత్ సింగ్, అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ విస్మరిస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్ ప్రధాన కార్యాలయంలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేటి పాలకులు బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా ఉన్నారని BJPపై విమర్శలు చేశారు. భగత్ సింగ్, అంబేడ్కర్ కలలను నెరవేర్చడానికే తాము రాజకీయాల్లోకి వచ్చామని, అధికారం కోసం కాదని వ్యాఖ్యానించారు.

Similar News

News January 22, 2026

DGEMEలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DGEME) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in/

News January 22, 2026

ట్రంప్ విమర్శలపై మోదీ మౌనం వెనక మతలబిదీ..!

image

ప్రపంచ నేతలను ట్రంప్ ఎడాపెడా వాయించేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా PM కార్నీ, UK PM స్టార్మర్.. ఇలా స్థాయి, హోదా చూడకుండా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితిని ఊహించే మన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ చేసిన ఏ విమర్శలకూ స్పందించలేదు. మౌనం పాటిస్తూ ఆయన వలలో పడకుండా చూసుకున్నారు. మోదీ ఈ హుందాతనం వల్లే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే సాహసం ట్రంప్ చేయలేదు.

News January 22, 2026

నైనీ కోల్ బ్లాక్ టెండర్ నోటిఫికేషన్ రద్దు: సింగరేణి

image

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్‌పై వివాదం రేగడంతో దానిని రద్దు చేస్తున్నట్లు ఇటీవల Dy CM భట్టి విక్రమార్క ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఆ టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రకటించింది. అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనపై SCCLను ప్రశ్నించింది. దీంతో టెండర్లపై మరోసారి బోర్డులో చర్చించి నిర్ణయిస్తామని చెప్పిన సంస్థ తదుపరి చర్యలు చేపట్టింది.