News October 28, 2024

టాలీవుడ్ నిర్మాత కన్నుమూత

image

సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి(85) బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో కన్నుమూశారు. తొలుత సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. వియ్యాలవారి కయ్యాలు, ప్రతిబింబాలు, ఒక దీపం వెలిగింది, శ్రీవినాయక విజయం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర్‌రావుతో 1982లో ఆయన తీసిన ‘ప్రతిబింబాలు’ 2022లో విడుదలైంది.

Similar News

News October 28, 2024

రైతులను దివాలా తీయిస్తారా?: KTR

image

TG: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనడం లేదన్న మీడియా కథనాలపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘దసరాకే కాదు. దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి’ అని కోరారు.

News October 28, 2024

పాక్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ గుడ్ బై

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్నారు. ప్లేయర్లతో అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో జాసన్ గిలెస్పీ/ఆకిబ్ జావేద్‌ను కోచ్‌గా నియమించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మేలో కిర్‌స్టెన్ PAK వైట్ బాల్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కాంట్రాక్టు ప్రకారం ఆయన రెండేళ్లపాటు కొనసాగాల్సి ఉంది. కానీ 6 నెలలకే రిజైన్ చేశారు.

News October 28, 2024

భారత్ చరిత్రలో తొలిసారి!

image

ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని భారత్ గెలుచుకుంది. పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా పోటీలో విజయం సాధించి మన దేశానికి తొలి కిరీటాన్ని తెచ్చిపెట్టారు. దీంతోపాటు గ్రాండ్ పేజెంట్స్ ఛాయిస్ అవార్డునూ ఆమె గెలుచుకున్నారు. ఇందులో 70 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. ‘మనం సాధించాం. భారత చరిత్రలో మొదటి గోల్డెన్ క్రౌన్‌ను గెలిచాం’ అని రాచెల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.