News October 8, 2024

ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో రాయితీపై టమాటా, ఉల్లి

image

AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.

Similar News

News November 26, 2025

ఇండియాలో భద్రతపై నమ్మకముంది: ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు DECలో జరగాల్సిన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ బాంబు పేలుడే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ PMO దీనిపై స్పందించింది. ‘ఇజ్రాయెల్-ఇండియాతో పాటు ప్రధానులు నెతన్యాహు, మోదీల బంధం చాలా బలమైనది. PM మోదీ నాయకత్వంలోని భారత్‌లో భద్రతపై మా ప్రధానికి పూర్తి నమ్మకముంది. ఇప్పటికే కొత్త డేట్స్ కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని ట్వీట్ చేసింది.

News November 26, 2025

ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

image

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.

News November 26, 2025

ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

image

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.