News March 16, 2024

రేపు గ్రూప్-1 పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్: సీఎస్

image

AP: రాష్ట్రంలో 81 గ్రూప్-1 పోస్టులకు రేపు జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. 301 కేంద్రాల్లో ఉ.10 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ జరుగుతుందన్నారు. 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్‌ను నియమించామని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.

News December 2, 2025

CTETకు దరఖాస్తు చేశారా?

image

CTET అర్హత కోసం అభ్యర్థుల నుంచి CBSE దరఖాస్తులు కోరుతోంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.Ed, D.EI.Ed అర్హతగల వారు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్‌, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET ఉత్తీర్ణత తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. ctet.nic.in/

News December 2, 2025

చర్మ ఆరోగ్యానికి టమాటా

image

ముఖంపై మచ్చలు, మొటిమలు, గుంతలు వంటి సమస్యలకు టమాటా పరిష్కారం చూపుతుందంటున్నారు చర్మ నిపుణులు. * టమాటా రసం, నిమ్మరసం కలిపి, దీంట్లో దూదిని ముంచి ముఖానికి అప్త్లె చేసుకొని మసాజ్ చేసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేస్తే ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. *టమాటా రసంలో శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.