News March 16, 2024
రేపు గ్రూప్-1 పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్: సీఎస్

AP: రాష్ట్రంలో 81 గ్రూప్-1 పోస్టులకు రేపు జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఎస్ జవహర్రెడ్డి వెల్లడించారు. 301 కేంద్రాల్లో ఉ.10 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ జరుగుతుందన్నారు. 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ను నియమించామని పేర్కొన్నారు.
Similar News
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్పై కఠినంగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రెండేళ్లుగా సీరియల్ కింద సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘జడ్జీలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు కోర్టులో చెప్పారు. తన భర్త ఫోనూ ట్యాప్ చేశారని కవిత అన్నారు. ఈ కేసుపై కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో మంత్రులు, కేసీఆర్ కుటుంబంలో సభ్యులు తమ వాటాల కోసం కొట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
News February 1, 2026
బడ్జెట్పై భౌగోళిక రాజకీయాల ఎఫెక్ట్!

ఈసారి బడ్జెట్పై జియోపాలిటిక్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రేర్ ఎర్త్ మెటల్స్పై చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటించింది. అణువిద్యుత్కు సంబంధించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీపై 2035 వరకు మినహాయింపు, సెమీకండక్టర్ మిషన్ 2.0 లాంచ్ విదేశాలపై ఆధారపడటం తగ్గించేందుకు తీసుకున్న చర్యలుగా తెలుస్తోంది. రక్షణ పటిష్ఠం చేసేందుకు డిఫెన్స్లోనూ భారీగా నిధులు కేటాయించింది.
News February 1, 2026
4 గంటలు.. అటు కేసీఆర్ విచారణ.. ఇటు ఆందోళనలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు 4 గంటలుగా విచారిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభమైన విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రశ్నలకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి.


