News October 15, 2024
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అటు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు.
Similar News
News October 17, 2025
రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

TG: రేపు బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా BC సంఘాల నేతలు బంద్ చేపట్టనున్నారు. దీనికి INC, BRS, BJP, CPI, CPM సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.
News October 17, 2025
రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

ట్రంప్కు PM మోదీ భయపడుతున్నారంటూ LoP రాహుల్ గాంధీ చేసిన <<18020106>>విమర్శలపై<<>> US సింగర్, నటి మేరీ మిల్బెన్ సెటైర్లు వేశారు. ‘రాహుల్ మీరు రాంగ్. ట్రంప్కు PM మోదీ భయపడటం లేదు. ఆయనకు ఈ లాంగ్ గేమ్పై అవగాహన ఉంది. USతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ లాగే మోదీ కూడా తమ దేశానికి ఏది ముఖ్యమో అదే చేస్తున్నారు. దేశాధినేతలు అలాగే చేస్తారు. ఇది మీకు అర్థం కాదు. మీకు PM అయ్యేంత చతురత లేదు’ అని ట్వీట్ చేశారు.
News October 17, 2025
TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పు!

AP: 2వేల టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. DECలో టెట్, ఆపై JANలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ప్రతీసారి వీటికి లీగల్ ఇష్యూస్ వస్తుండడంతో వాటిపై దృష్టి పెట్టారు. నిపుణులతో చర్చించి అర్హతలు ఇతర నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇటీవలి DSCలో 16317 పోస్టుల్లో 15941 భర్తీ అయ్యాయి. మిగిలిన వాటితో పాటు ఇతర ఖాళీలు భర్తీ చేస్తారు.