News March 13, 2025

రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

image

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

Similar News

News April 4, 2026

టాస్ గెలిచిన ఢిల్లీ.. ముంబైకి హార్దిక్ దూరం

image

ఢిల్లీ వేదికగా కాసేపట్లో MI, DC తలపడనున్నాయి. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు MI కెప్టెన్ హార్దిక్ దూరమయ్యారు. దీంతో సూర్య కెప్టెన్సీ చేస్తున్నారు. టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ బౌలింగ్ ఎంచుకొన్నారు.
MI: రోహిత్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్, రూథర్‌ఫోర్డ్, శాంట్నర్, బాష్, శార్దూల్, దీపక్, బుమ్రా
DC: రాహుల్, నిస్సాంక, నితీశ్ రాణా, నిగమ్, అక్షర్, మిల్లర్, స్టబ్స్, కుల్దీప్, ఎంగిడి, నటరాజన్, ముకేశ్

News April 4, 2026

సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం: జైశంకర్

image

ప్రపంచ దేశాలతోపాటు అంతర్గతంగా ఎదురైన ఎన్నో సవాళ్లను భారత్ విజయవంతంగా ఎదుర్కొందని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. IIM రాయ్‌పూర్‌ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ‘మన సామర్థ్యాన్ని పరీక్షించిన ఎన్నో షాక్‌ల నుంచి బయటపడ్డాం. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, పెరుగుతున్న పోటీతత్వం కారణంగా మన కెపాసిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు.

News April 4, 2026

ఏపీ కొత్త మ్యాప్ విడుదల

image

అమరావతి రాజధానిగా 28 జిల్లాలతో APSDMA కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి.