News March 13, 2025
రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.
Similar News
News October 22, 2025
కర్మ ఫలం ఎంత విచిత్రమైనదో!

తనకు పుట్టిన పసిబిడ్డ కర్ణుడిని లోక నిందకు భయపడి కుంతీ దేవి నదిలో వదిలివేసింది. ఆ పసిబిడ్డ లోకాన్ని ఏలేంత వీరుడై, తన కన్నతల్లికే కంటకుడయ్యాడు. చివరికి ఆ కుంతీ దేవియే కన్న ప్రేమతో తన ఐదుగురు కుమారుల(పాండవుల) ప్రాణాలను కాపాడమని, తాను నదిలో వదిలేసిన బిడ్డనే బతిమాలాల్సి వచ్చింది. చేసిన కర్మ ఫలితం ఏదో ఒక రూపంలో అనుభవించక తప్పదని ఈ ఘట్టం రుజువు చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆయన పాండవులను చంపడు.
News October 22, 2025
ఛోక్సీ కోసం ఆర్థర్ రోడ్ జైలు సిద్ధం!

ఆర్థిక నేరస్థుడు మెహుల్ <<18037252>>ఛోక్సీ<<>> కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సిద్ధమైంది. బ్యారక్ నం-12లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇందులో 2 రూములు ఉండగా అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను అధికారులు బెల్జియం ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. త్వరలోనే ఛోక్సీని భారత్కు బెల్జియం అప్పగించే అవకాశం ఉంది. ఇక అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్థర్ రోడ్ జైలులోనే గతంలో 26/11 నిందితుడు అజ్మల్ కసబ్ను ఉంచారు.
News October 22, 2025
సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా నక్షత్రంతో లెక్కించేవారు. ఈ నక్షత్రం పేరు మీదుగానే ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. ఈ ఆరు తారలే ఆరు తలలు గల సుబ్రహ్మణ్య స్వామికి తల్లిలా పాలు ఇచ్చాయట. ఈ అనుబంధం వల్లే సుబ్రహ్మణ్య స్వామికి ‘కార్తికేయ’ అనే నామం సిద్ధించిందని పురాణాలు చెబుతున్నాయి. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక స్టోరీల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.