News September 23, 2025

డిగ్రీ కోర్సుల్లో చేరికకు రేపే తుది గడువు

image

AP: వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడతలో సీట్లు పొందిన వారు బుధవారం లోగా కాలేజీల్లో చేరాలని OAMDC కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు తమ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. కాగా ఏపీలోని 1200 డిగ్రీ కాలేజీల్లో 3,82,038 సీట్లుండగా తొలివిడతలో 1,30,273 మందికి కేటాయించారు. 251765 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుంది.

Similar News

News September 23, 2025

బికినీలో సాయిపల్లవి అని ప్రచారం.. నిజమేనా?

image

సాయి పల్లవి బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు SMలో వైరలయ్యాయి. ఇవి నిజమని నమ్మిన కొందరు మూవీ ఛాన్సుల కోసం ఆమె మారిపోయారంటూ విమర్శిస్తున్నారు. అయితే అవి నిజమైన ఫొటోలు కాదని తేలింది. ఆమె సోదరి పూజ ఇటీవల స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను instaలో పోస్ట్ చేయగా, వాటిని కొందరు బికినీ ధరించినట్లుగా AI సాయంతో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు.

News September 23, 2025

ఈ ఫొటోలోని సెన్సేషనల్ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

image

పై ఫొటోలో ఓ దిగ్గజ దర్శకుడు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలను పరిచయం చేస్తే.. ఈయన టాలీవుడ్‌కు డైనమిక్ డైరెక్టర్లను అందించారు. యువ దర్శకులకు ఆయన మూవీ ఓ ప్రయోగశాల వంటిది. విజయాల నుంచి వివాదాల వరకు అన్నింటా ఆయనదే పైచేయి. ఆ సెన్సేషనల్ డైరెక్టరెవరో గుర్తుపట్టారా?
COMMENT.

News September 23, 2025

₹3,745 కోట్ల పెట్టుబడులు.. 1,518 ఉద్యోగాలు

image

TG: రాష్ట్రంలో కోకా కోలా, JSW, తోషిబా కంపెనీల ₹3,745 కోట్ల విలువైన పెట్టుబడులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 1,518 ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. కోకా కోలా ₹2,398Cr (600 ఉద్యోగాలు), JSW UAV కొత్త యూనిట్ ₹785Cr (364 జాబ్స్), తోషిబా ₹562Cr (554 జాబ్స్) పెట్టుబడులు పెట్టనున్నాయి. కోకా కోలా వంటి కంపెనీల ఏర్పాటుతో మామిడి, నారింజ రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని Dy.CM భట్టి అన్నారు.