News August 8, 2024
రేపే ‘ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్’ మూవీ లాంచ్

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో రాబోయే మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని రేపు అధికారికంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ‘న్యూ బిగినింగ్స్.. హైదరాబాద్ పిలుస్తోంది’ అంటూ ప్రశాంత్ భార్య లికిత ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో లాంచ్పై మరింత ఆత్రుత పెరిగింది. మేకర్సే రేపు ఫొటోలు షేర్ చేస్తారని సమాచారం.
Similar News
News January 1, 2026
కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

రష్యా నియంత్రణలోని ఖేర్సన్లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.
News January 1, 2026
ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉద్యోగాలు

<
News January 1, 2026
భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

డెహ్రాడూన్లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్గఢ్లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.


