News August 8, 2024

రేపే ‘ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్’ మూవీ లాంచ్

image

ప్రశాంత్ నీల్‌, ఎన్టీఆర్ కాంబోలో రాబోయే మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని రేపు అధికారికంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ‘న్యూ బిగినింగ్స్.. హైదరాబాద్ పిలుస్తోంది’ అంటూ ప్రశాంత్ భార్య లికిత ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో లాంచ్‌పై మరింత ఆత్రుత పెరిగింది. మేకర్సే రేపు ఫొటోలు షేర్ చేస్తారని సమాచారం.

Similar News

News January 1, 2026

కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

image

రష్యా నియంత్రణలోని ఖేర్సన్‌లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.

News January 1, 2026

ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఉద్యోగాలు

image

<>ఇన్‌కమ్<<>> ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB/LLM, CA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.60వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://incometaxkarnatakagoa.gov.in

News January 1, 2026

భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

image

డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.