News September 24, 2024
రేపు జమ్మూకశ్మీర్ రెండో విడత ఎన్నికలు
జమ్మూకశ్మీర్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 26 సీట్లలో పోలింగ్ జరగనుంది. ఇందులో కశ్మీర్లో 15, జమ్మూలో 11 నియోజకవర్గాలు ఉన్నాయి. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బుద్గాం, గందర్బాల్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 24 స్థానాలకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News September 24, 2024
ఆ పార్టీలు బీజేపీకి మరింత దగ్గరవుతున్నాయ్!
TDP, JDU కేంద్రంలో BJPకి మరింత దగ్గరవుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తిరుమల ప్రసాదం వివాదంలో TDP-జనసేన వైఖరి, విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన 8 నెలల తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణంపై PM మోదీని బిహార్ CM నితీశ్ ప్రశంసించడం అందులో భాగమే అని చెబుతున్నారు. అయితే, హిందూత్వ ఓటు బ్యాంకు BJPకి దక్కకుండా ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
News September 24, 2024
భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు
తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల భార్యతో విడాకులు తీసుకోనున్నట్లు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.
News September 24, 2024
శ్రేయస్ అయ్యర్ కొత్త ఇల్లు బాగా కాస్ట్లీ.. Sq.ftకి ₹55,238
చదరపు అడుగుకి రూ.10 వేలు అంటేనే అమ్మో అంటాం. అలాంటిది ముంబైలోని వర్లీలో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, అతని తల్లి Sq.ftకి ₹55,238 చొప్పున 525 చ.అ ఇంటిని ₹2.90 కోట్లతో కొన్నట్టు జాప్కీ యాక్సెస్ వెల్లడించింది. దీనికి స్టాంప్ డ్యూటీ ₹17.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ₹30,000 *శ్రేయస్ అయ్యర్ గతంలో ముంబైలో మాక్రోటెక్ డెవలపర్లతో 48వ ఫ్లోర్లో 2380 Sq.ft ఇంటిని చ.అ.కు ₹49,817 చొప్పున కొనుగోలు చేశారు.