News April 24, 2025
రేపు ఆకాశం ‘నవ్వుతుంది’

ఆనందానికి చిహ్నమైన స్మైలీ ఫేస్ రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 5.30 గంటలకు శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. శుక్రుడు, శని 2 కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లుగా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా తెలిపింది. మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది.
Similar News
News April 24, 2025
ఉగ్రదాడి.. కేంద్రంపై షర్మిల తీవ్ర విమర్శలు

AP: ఉగ్రదాడి ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఈ చౌకీదార్ ప్రభుత్వం సొంత ప్రజలపై లాఠీ ఝులిపిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటంలో బిజీగా ఉండి సరిహద్దుల్లో రక్షణ కల్పించడంలో ఫెయిలైందని దుయ్యబట్టారు. ‘ప్రధాని మోదీజీ. ఇదిగో మీ లాఠీ. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించే వారిపై కాకుండా మన శత్రువులపై ఉపయోగించండి’ అని లాఠీ పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.
News April 24, 2025
టెన్త్ రిజల్ట్స్.. కవలలకు ఒకే మార్కులు

AP: పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కవలలు టెన్త్ ఫలితాల్లో సాధించిన మార్కులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బలిజిపేట (M) వంతరాం గ్రామానికి చెందిన బెవర శ్రవణ్, బెవర సింధు కవలలు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ఇద్దరికీ 582 చొప్పున మార్కులు రాగా, స్థానికంగా ఈ విషయం ఆసక్తి రేపింది. మంచి మార్కులు సాధించినందుకు వీరి తల్లిదండ్రులు ఉమా, రాము సంతోషపడ్డారు.
News April 24, 2025
ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లోని ఫిట్జీ కోచింగ్ సెంటర్లపై ఈడీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు PMLA కింద కేసు నమోదు చేసింది. ఫిట్జీ తమకు సంబంధించిన కొన్ని కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేయడం ద్వారా రూ.11.11 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేపట్టింది. మనీ లాండరింగ్కు కూడా పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది.