News July 14, 2024
సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: ప్రభుత్వం

AP: మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
Similar News
News December 5, 2025
పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.
News December 5, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in
News December 5, 2025
అందుకే IPLకు గుడ్బై చెప్పా: ఆండ్రీ రస్సెల్

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ IPLకు <<18429844>>గుడ్బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్లు, ప్రాక్టీస్, జిమ్ వర్క్లోడ్ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.


