News July 14, 2024
సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: ప్రభుత్వం

AP: మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
Similar News
News December 19, 2025
జాబ్ ఛేంజ్ మధ్య 60 రోజుల గ్యాప్ ఉన్నా EDLI ప్రయోజనం

జాబ్ ఛేంజ్ అయ్యేవారికి ‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్’ (EDLI) విషయంలో ఇక ఆందోళన అక్కర్లేదు. మరో కంపెనీలో చేరడానికి ముందు వీకెండ్స్, అధికారిక సెలవులతో పాటు 60 రోజుల గ్యాప్ను సర్వీస్ బ్రేక్ కింద పరిగణించకూడదని EPFO స్పష్టం చేసింది. సర్వీస్ బ్రేక్ పేరిట EDLI స్కీమ్ కింద డెత్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడం లేదంటే తక్కువ చెల్లిస్తున్న నేపథ్యంలో నిబంధనల్లో EPFO ఈ మేరకు మార్పులు చేసింది.
News December 19, 2025
యూరియా బుకింగ్.. 24hrsలోగా తీసుకోకపోతే..

TG: యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ <<18577487>>యాప్<<>> ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. యాప్లో బుక్ చేసిన 24 గంటల్లోగా వెళ్తేనే యూరియా బస్తాలు ఇస్తారు. లేదంటే మరో 15 రోజుల వరకు బుకింగ్కు అవకాశం ఉండదు. ప్రస్తుతం రైతులకు ఎకరా వరికి రెండున్నర బస్తాలు, మక్క, ఇతర పంటలకు 3 బస్తాలు, మిర్చికి 5 బస్తాల లిమిట్ పెట్టారు. బుక్ చేసుకున్న గంట తర్వాత నుంచే బస్తాలు తీసుకోవచ్చు.
News December 19, 2025
గులాబీ, మల్లె తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ సమయంలో గులాబి తోటలను ఆకు, మొగ్గ తొలుచు పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి స్పైనోశాడ్ 0.3ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి పిచికారీ చేయాలి. మల్లె తోటల్లో ఇప్పటికే ఆకులను తీసేస్తే ప్రతి మొక్కకు 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 90 గ్రా. నత్రజని, 120గ్రా. భాస్వరం, పొటాష్ ఎరువులను కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే ఇవ్వాలి. దీని వల్ల పూలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.


