News July 14, 2024
సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: ప్రభుత్వం

AP: మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
Similar News
News December 13, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
News December 13, 2025
మన పూర్వ జన్మ సుకృతాలేంటో తెలుసా?

ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!!
ఈ శ్లోకం ప్రకారం.. మన జీవితంలో వచ్చే పశువులు, భార్య, కొడుకులు, ఇల్లు.. ఇవన్నీ మన పూర్వ జన్మ సుకృతాలను బట్టి ఏర్పడుతాయి. ఇది కేవలం రుణాబంధం మాత్రమే. రుణం తీరిపోగానే వారు మనల్ని వదిలి వెళ్లిపోతారు. మన అనుకున్నవన్నీ మనకు దూరమవుతాయి. ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మంచి జరిగినా, చెడు జరిగినా మనం బాధ పడకుండా జీవించగలము.
News December 13, 2025
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు

AP: WC గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన ఊరికి రోడ్డు లేదని నిన్న Dy.CM పవన్ను కలిసినప్పుడు తెలిపారు. శ్రీసత్యసాయి(D) హేమావతి-తంబలహెట్టి వరకు రోడ్డుకు రూ.3.2CR, గున్నేహళ్లి-తంబలహెట్టి రోడ్డుకు రూ.3CR అవసరమని అధికారులు అంచనా రూపొందించగా, పర్మిషన్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. సాయంత్రానికి జిల్లా కలెక్టర్ పాలనపరమైన అనుమతులిచ్చారు. మరోవైపు జట్టుకు పవన్ రూ.84లక్షల ప్రోత్సాహకం అందించారు.


