News July 14, 2024
సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: ప్రభుత్వం

AP: మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
Similar News
News December 17, 2025
ఐటీఐ అర్హతతో 156 పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News December 17, 2025
VIRAL: రష్మిక బ్యాచిలర్ పార్టీ?

విజయ్ దేవరకొండ, రష్మిక <<18465261>>2026లో పెళ్లి<<>> చేసుకోనున్నట్లు ప్రచారం సాగుతున్న సమయంలో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె తన గ్యాంగ్తో కలిసి శ్రీలంకకు వెళ్లిన ఫొటోలను SMలో షేర్ చేశారు. రష్మికతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, హీరోయిన్ వర్ష బొల్లమ్మ సహా మరికొందరు సన్నిహితులు ఈ ట్రిప్లో ఉన్నారు. కేవలం మహిళలతో ఉండటంతో ఇది పెళ్లికి ముందు ఇచ్చిన బ్యాచిలర్ పార్టీ కావచ్చని అభిమానులు అంటున్నారు.
News December 17, 2025
నువ్వుల చేనులో మనుషులతో కలుపు నివారణ వల్ల లాభాలు

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.


