News March 23, 2025

పాపం భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన

image

KKRతో మ్యాచులో పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను RCB బెంచ్‌కే పరిమితం చేసింది. తుది జట్టులో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో SRH ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే SRHలో ఉండుంటే డగౌట్‌లో కూర్చునే పరిస్థితి రాదని కామెంట్లు పెడుతున్నారు. తర్వాతి మ్యాచుకైనా భువీని జట్టులోకి తీసుకోవాలని RCB యాజమాన్యాన్ని కోరుతున్నారు. కాగా భువీ దశాబ్దానికిపైగా SRHకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

Similar News

News March 24, 2025

నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. క్షీణిస్తున్న మానసిక, శారీరక ఆరోగ్యం కారణంగా ఆయన ఇకపై పాలించడానికి తగినవారు కాదని అన్నారు. ‘నితీశ్ కుమార్ మెంటల్లీ అన్‌ఫిట్. ఎవరికైనా డౌట్ ఉంటే మంత్రుల పేర్లు చెప్పమని అడగండి. ఆయన పరిస్థితి గురించి ప్రధాని మోదీ, అమిత్ షాకు తెలియదంటే నమ్మలేకపోతున్నా’ అని వ్యాఖ్యానించారు.

News March 24, 2025

IPL: ముంబైకి ఇదేం కొత్త కాదు

image

IPLలో ముంబై ఇండియన్స్ ఓ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోంది. 2013 నుంచి ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోవడం అలవాటుగా మార్చుకుంది. తాజాగా CSKతో మ్యాచులోనూ ఓడిపోయింది. ఇలా వరుసగా 13 ఓపెనింగ్ మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. అయితే 2013 నుంచి 5 సార్లు ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడం గమనార్హం.

News March 24, 2025

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: DGP

image

AP: బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు DGP హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. IPL బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.

error: Content is protected !!