News August 7, 2024

కఠినంగా వ్యవహరిస్తున్న బ్రిట‌న్

image

అక్ర‌మ చొర‌బాట్ల‌ను నిర‌సిస్తూ బ్రిట‌న్‌లో చెల‌రేగిన అల్ల‌ర్ల‌ను అక్క‌డి ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. బాధ్యులు మున్ముందు బాధ‌ప‌డాల్సి ఉంటుంద‌ని ప్ర‌ధాని స్టార్మ‌ర్ హెచ్చ‌రించారు. స‌మాజంలో విద్వేషాన్ని పెంచుతున్న నిర‌స‌న‌కారుల‌పై ఉగ్ర‌వాద చ‌ట్టాల కింద అభియోగాలు న‌మోదు చేస్తామ‌ని హోం శాఖ స్పష్టం చేసింది. బ్రిట‌న్‌లో ముస్లింల అక్ర‌మ వ‌ల‌స‌లపై ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.

Similar News

News November 12, 2025

HNK: మూడో రోజు.. మూడు జిల్లాల యువత సత్తా చాటారు!

image

హనుమకొండ జేఎన్‌ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ మూడో రోజు మూడు జిల్లాల అభ్యర్థులతో ఉత్సాహంగా సాగింది. ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎంపికైన 623 మంది అభ్యర్థులు రన్నింగ్‌, ఫిజికల్‌ ఫిట్నెస్‌ పరీక్షల్లో పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు ఎత్తు, బరువు, ఛాతీ ప్రమాణాలను పరీక్షించి, ఉత్తీర్ణులైన వారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించారు.

News November 12, 2025

జమ్మూకశ్మీర్‌లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

image

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.

News November 12, 2025

ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతాం: కేంద్రం

image

ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘దర్యాప్తును అత్యవసరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది’ అని తెలిపారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.