News August 22, 2025
పీడిస్తున్న విష జ్వరాలు.. పెరుగుతున్న బాధితులు!

TG: వర్షాలు, వరదల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఓపీ కోసం ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య 30% పెరిగింది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు సమాచారం. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నడుము నొప్పి, ఒంటిపై దద్దుర్లు, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News August 22, 2025
EV కార్ల బ్యాటరీలపై అపోహలు-నిజాలు!

EV కారు బ్యాటరీపై ప్రజల్లో నెలొకన్న సందేహాలను Deloitte 2025 రిపోర్ట్ నివృత్తి చేస్తోంది. ఆ నివేదిక ప్రకారం.. EV కారు కొన్న మూడేళ్లకే లక్షలు పెట్టి బ్యాటరీ మార్చనక్కర్లేదు. వాటికి కనీసం 10-20 ఏళ్ల లైఫ్ ఉంటుంది. TATA మోటార్స్ లైఫ్ టైమ్, OLA 8ఏళ్లు వారంటీ ఇస్తున్నాయి. టెస్లా డేటా ప్రకారం 2లక్షల కి.మీ. డ్రైవ్ చేసినా బ్యాటరీ కెపాసిటీ 80% ఉంటుంది. EV కార్ల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
News August 22, 2025
కేసీఆర్ పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న HC

TG: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే ముందుకెళ్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు.
News August 22, 2025
తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ విషెస్

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుమారుడు రామ్ చరణ్ ఎమోషనల్ విషెస్ చెప్పారు. ‘నా హీరో, నా గైడ్, నా స్ఫూర్తి మీరే. నేను సాధించిన విజయం, నేను నేర్చుకున్న విలువలు మీ నుంచి పొందినవే. 70ఏళ్ల వయసులో మీరు మరింత స్ఫూర్తిని నింపుతున్నారు. బెస్ట్ ఫాదర్గా ఉన్నందుకు థాంక్స్’ అని పోస్ట్ చేశారు. అటు చిరంజీవి బర్త్డే నేపథ్యంలో సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.