News April 16, 2025
రేపు రాష్ట్రవ్యాప్త ధర్నాలకు టీపీసీసీ పిలుపు

TG: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో BJP ప్రభుత్వం, ED కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. AICC అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ రేపు HYD ఈడీ ఆఫీసు వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ DCCల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు.
Similar News
News September 16, 2025
విషాదం.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

AP: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డిగ్రీ విద్యార్థిని నాగమణి(18) హార్ట్ ఎటాక్తో ప్రాణాలు కోల్పోయింది. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి స్నేహితులతో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. వారితో మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారు.
News September 16, 2025
ఇంట్లో శంఖం ఉంచవచ్చా?

ఇంట్లో శంఖం ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ‘శంఖం ఊదడం వల్ల పాపాలు నశిస్తాయి. వాస్తు దోషాలు తొలగి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి, విష్ణువులకు శంఖం ప్రియమైంది. ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోనే ఉంటుంది. శంఖం ఊదడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి’ అని అంటున్నారు.
News September 16, 2025
హనుమంతుడు స్త్రీ రూపంలో వెలసిన ఆలయం

ఛత్తీస్గఢ్లోని రతన్పూర్లో ఉన్న ‘గిరిజాబంద్ హనుమాన్ ఆలయం’ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న రాజు పృథ్వీ దేవ్జూ కలలో కనిపించిన హనుమంతుడు, ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. నిర్మాణం పూర్తయ్యాక, జలాశయం నుంచి బయటపడిన స్త్రీ రూపంలోని హనుమాన్ విగ్రహాన్నే రాజు ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత రాజుకు వ్యాధి నయమైంది.