News February 7, 2025
TPT: ఇటీవలే రిటైర్మెంట్.. అంతలోనే సూసైడ్

తిరుమలలో భార్యాభర్త <<15390232>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసుల నాయుడు(60) కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో పనిచేశారు. ఇటీవలే ఆయన రిటైరయ్యారు. శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఆయన తిరుమలకు వెళ్లి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు.
Similar News
News February 17, 2026
బరువు పెరగని జపనీస్.. ‘హరా హచి బు’ సీక్రెట్ తెలుసా?

ప్రపంచంలో తక్కువ ఊబకాయం కలిగిన జపాన్ నుంచి భారత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కడుపు 80% నిండాక తినడం ఆపడం (హరా హచి బు), స్కూల్ స్థాయి నుంచే పోషకాహారంపై అవగాహన, చక్కెర తగ్గించడం, నడకను జీవనశైలిలో భాగం చేయడం అక్కడ కీలకం. నడుము కొలతను పర్యవేక్షించే ‘మెటాబో లా’ వంటి చట్టాలు, హెల్తీ ఫుడ్ ఈజీగా దొరకడం వల్ల జపాన్ ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మనతో పోలిస్తే వారికి డిసిప్లిన్ చాలా ఎక్కువ.
News February 17, 2026
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్లో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 42 కేంద్రాల్లో 20,041 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
News February 17, 2026
NZB: ‘ఈనెల 18 నుంచి AISF 4వ రాష్ట్ర మహాసభలు’

ఈనెల 18 నుంచి 20 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే AISF 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం NZBలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలకు విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోతు రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షుడు సుబోద్, కుషాల్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


