News April 3, 2024
TPT: క్రీడలపట్ల అవగాహన కల్పించిన భారత కెప్టెన్

భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రజని టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడలకు సంబంధించి అవగాహన కల్పించారు. దేవస్థానం విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ ఆహ్వానం మేరకు బుధవారం ఆర్ట్స్ కళాశాలకు విచ్చేశారు. క్రమశిక్షణతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అని ఆమె విద్యార్థులకు తెలియజేశారు. క్రీడాకారులకు 20 హాకీ స్టిక్స్ బహుమతిగా అందజేశారు.
Similar News
News February 8, 2026
చిత్తూరు జిల్లాలో కోడి ధర KG రూ.140

చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.132-రూ.140 లవరకు ఉంది. మాంసం రూ.191-రూ.216 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.218 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.75 గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 8, 2026
చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ లో తప్పిదాల సవరణకు అవకాశం కల్పించారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్లో ఆన్ లైన్లో సవరణలు చేసుకునేందుకు హెచ్ఎం లాగిన్లో అవకాశం కల్పించారన్నారు. దీన్ని ఆయా హెచ్ఎంలు సద్వినియోగం చేసుకుని, ఈనెల 12వ తేదీ లోపు తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకోవాలన్నారు.
News February 7, 2026
కుప్పంలో వరుసగా అమ్మాయిల మిస్సింగ్

కుప్పం నియోజకవర్గ పరిధిలో వారం రోజుల్లో ఐదుగురు యువతుల మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారమో లేక కుటుంబ కారణాల నేపథ్యమో తెలియదు గానీ మైనర్ బాలికలతో పాటు 22 ఏళ్లలోపు యువతులు అదృశ్యమవుతున్నారు. వారం రోజుల్లో రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రాళ్ల బూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క మిస్సింగ్ కేసు నమోదయింది.


