News July 22, 2024
TPT: డిప్లమా కోర్సులో దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్లో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ యానిమల్ హస్బండరీ (Animal Husbandry Diploma) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. పదో తరగతి పాసైనా అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 22.
Similar News
News October 22, 2025
బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని 12 మేకల మృతి

బంగారుపాళ్యం మండలం గుండ్ల కట్టమంచి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. యజమాని వివరాలు మేరకు.. బెంగళూర్- చెన్నై జాతీయ రహదారిపై మేకల రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని కంటైనర్ ఢీకొనడంతో 12 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
News October 22, 2025
చిత్తూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు డీఈఓ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలను పాటించాలని కోరారు.
News October 22, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాస్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి, ప్రమాదకర చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.