News February 25, 2025

TPT: రూ.2.5 కోట్లతో బ్యాంక్ ఉద్యోగి బెట్టింగ్..?

image

తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రజలు తాకట్టు పెట్టిన ఐదున్నర కేజీల బంగారు నగలు లూటీ చేయడం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ సూర్యతేజ ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడినట్లు సమాచారం. రోజుకు రూ.5 లక్షల చొప్పున 50 రోజుల్లో రూ.2.5 కోట్లతో ఆన్‌లైన్ క్యాసినో ఆడేసినట్లు తెలుస్తోంది. 

Similar News

News March 24, 2025

అల్లూరి జిల్లాలో పిడుగుపాటుకు అవకాశం 

image

అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెట్లు, పొలాల్లో, టవర్స్ కింద ఉండరాదని హెచ్చరించారు. పాడేరు, డుంబ్రిగుడ, హుకుంపేట, మాడుగుల, గంగవరం, గూడెం, అనంతగిరి, అరకు, చింతపల్లి మండలాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

News March 24, 2025

కర్నూలు మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను!

image

కర్నూలు మేయర్‌ బీవై రామయ్యకు అవిశ్వాస గండం తప్పదా? ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరో ఏడాది పదవీ కాలం ఉండగా TDP అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. నగర కార్పొరేషన్‌‌లో 52మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ బలం 22కు చేరింది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 28మంది అవసరం. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

News March 24, 2025

మళ్లీ సొంతగూటికేనా!

image

కాపు రామచంద్రారెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం YCP ఇన్‌ఛార్జిగా ఉన్న గోవిందరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. ఇదే సమయంలో తనకు BJPలో తగిన గుర్తింపు లభించకపోవడంతో రామచంద్రారెడ్డి తిరిగి YCPలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. జగన్ జిల్లాల టూర్‌లో వైసీపీలో కండువా కప్పుకునే అవకాశముంది.

error: Content is protected !!