News July 5, 2024

TPT: దరఖాస్తులకు రేపే చివరి తేదీ

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుందని కార్యాలయం పేర్కొంది. సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, వివిధ రకాల సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జులై 06.

Similar News

News July 8, 2024

తిరుపతి: ఫుడ్ కోర్ట్ ప్రారంభించిన ఎస్పీ

image

పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లాస్థాయి దళం కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నూతన ఫుడ్ కోర్టును ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. విధినిర్వహణలో ఉండి ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయలేని సిబ్బంది కోసం దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎటువంటి లాభాపేక్షా లేకుండా, తక్కువ ధరకే ఆహార పదార్థాలు సిబ్బందికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్ విమల కుమారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News July 8, 2024

పుంగనూరు: న్యాయ విభాగం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి

image

వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేలా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం నలుగురు లాయర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకుంటే.. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని వెల్లడించారు.

News July 8, 2024

నగరి : YSRకు నివాళులు అర్పించిన ఆర్కే రోజా

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. రాష్ట్ర చరిత్రలోనే 108 అంబులెన్స్ ప్రవేశపెట్టి రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఎంతోమందికి పునఃజన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.