News April 20, 2024

TPT: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో ప్రాజెక్టు అసోసియేట్ – 01 పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ (M.Sc) బయాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 02.

Similar News

News December 19, 2025

చిత్తూరు: 1447 మంది గైర్హాజరు.!

image

చిత్తూరు జిల్లాలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం పాఠశాలల్లో వందరోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు 1447 మంది విద్యార్థులు గైర్హాజరవుతున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1529 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక తరగతులకు 13,762 మంది మాత్రం హాజరవుతున్నట్టు వెల్లడించారు. అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.

News December 19, 2025

చిత్తూరు: పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం

image

రిజిస్ట్రేషన్- స్టాంపుల శాఖ విడుదల చేసిన ఏప్రిల్-నవంబరు 2025 నివేదిక ప్రకారం చిత్తూరు జిల్లాలో లక్ష్యానికి మించి ఆదాయం సాధించింది. లక్ష్యం రూ.107.98 కోట్లు కాగా, రూ.111.57 కోట్ల మేర ఆదాయం ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.86.38 కోట్ల రెవెన్యూ మాత్రమే వచ్చింది. అంటే ఈసారి రెవెన్యూ 29శాతం ఎక్కువగా సాధించింది.

News December 19, 2025

చిత్తూరు జిల్లాలకు రూ.28 కోట్ల నిధులు విడుదల

image

కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.28,52,04,883 గురువారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వ హణ, మౌలిక సదుపాయాల నిమిత్తం ఈ నిధులను విడుదల చేసింది. జిల్లాలో 697 పంచాయతీలు ఉండగా 667 పంచాయతీలకు నిధులు విడుదలయ్యాయి. 13చోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో మిగిలిన 17 పంచాయతీలలో వివిధ కారణాలతో నిధులు విడుదల కాలేదు.