News December 9, 2025

TPT: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్‌పే చేయడంతోనే!

image

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్‌తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్‌గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.

Similar News

News December 13, 2025

ఐఐటీ భువనేశ్వర్‌లో 101పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఐఐటీ <<>>భువనేశ్వర్‌ 101 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 8వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ, జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ, MLSc, MBBS, MD, DNB, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iitbbs.ac.in

News December 13, 2025

‘అఖండ-2’లో పాట పడిన నందికొట్కూరు సింగర్

image

బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రంలో పాట పాడిన సింగర్ కరిముల్లాను చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు శుక్రవారం సన్మానించారు. ఆయన చిత్రాని గీసి కరిముల్లాకు అందించారు. నందికొట్కూరుకు చెందిన ఈయన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ‘జై బాలయ్య’ పాటతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. శ్రీనివాసులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో సినీ పరిశ్రమలో మరెన్నో అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు.

News December 13, 2025

దూసుకెళ్తున్న కోడి గుడ్ల ధరలు

image

APలో గుడ్ల ధరలు దూసుకెళ్తున్నాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఇవాళ విజయవాడలో 100 గుడ్ల ధర అత్యధికంగా ₹690గా ఉంది. అనపర్తి, తణుకులో ₹665, విజయనగరం, శ్రీకాకుళంలో ₹664, చిత్తూరులో ₹663, విశాఖలో ₹660 పలుకుతోంది. రిటైల్‌లో ₹8-10కి అమ్ముతున్నారు. 4 నెలల కిందట ఈ రేటు రూ.5.50గా <<18317956>>ఉండేది<<>>. గుడ్ల ఉత్పత్తి తగ్గడంతోనే రేట్లు అధికమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.