News January 7, 2025

TPT: PG కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG) నోటిఫికేషన్ విడుదలైనట్లు కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్‌ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 2గా పేర్కొన్నారు.

Similar News

News January 8, 2025

పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇచ్చేయండి: హైకోర్టు

image

ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి నుంచి పోలీసులు లైసెన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. 2 వారాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయుధాలు అప్పగించాలని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఆదేశించారు.

News January 7, 2025

ఢిల్లీలో శాంతిపురం యువకుడి దారుణ హత్య

image

ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం(M) వెంకటేల్లికి చెందిన హరి కుమారుడు సునీల్ దిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సునీల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.4 లక్షలు అప్పులు చేశాడు. 3 రోజుల కిందట కుటుంబసభ్యులు అతడికి రూ.2 లక్షలు పంపించారు. మిగిలిన రూ.2లక్షలు ఇవ్వలేదని యువకుడిని సోమవారం బెట్టింగ్ గ్యాంగ్ హత్య చేశారని మంగళవారం కుటుంబసభ్యులు ఆరోపించారు.

News January 7, 2025

చిత్తూరు ప్రజలు భయపడకండి: డాక్టర్లు

image

చిత్తూరు జిల్లాకు పక్కనే ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తిరుపతి రుయా డాక్టర్ రవిప్రభు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని తిరుపతి DMHO బాలకృష్ణ నాయక్ స్పష్టం చేశారు.