News February 28, 2025
ట్రేడింగ్ యాక్టివిటీ 30% డౌన్: జెరోధా ఫౌండర్

స్టాక్మార్కెట్లు గరిష్ఠాలకు చేరినట్టే పతనమూ అవుతున్నాయని జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ అన్నారు. ‘ఇకపై సూచీల గమనం ఎటో తెలియదు. బ్రోకింగ్ ఇండస్ట్రీ మాత్రం ఇబ్బంది పడుతోంది. మొత్తంగా 30% యాక్టివిటీ పడిపోయింది. ట్రేడర్లు తగ్గారు. వాల్యూమ్ తగ్గింది. జెరోధా ఆరంభించాక 15ఏళ్లలో తొలిసారి డీగ్రోత్ చూస్తున్నాం. ఇలాగైతే STT ద్వారా ప్రభుత్వం ఆశించిన ₹80K CR కాదు అందులో 50% అయిన ₹40K CR సైతం రాద’ని అంచనా వేశారు.
Similar News
News February 28, 2025
శివరాత్రి వేళ రూ.కోటి దాటిన రాజన్న ఆలయ ఆదాయం

మహాశివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల ద్వారా రూ.57.12లక్షల ఆదాయంరాగా కోడె మెుక్కుల ద్వారా రూ.45.83లక్షలు వచ్చిందని పేర్కొన్నారు. స్వామివారిని 2లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
News February 28, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

AP: విజయవాడ కమిషనరేట్ పరిధిలో రేపటి నుంచి కొత్త వాహన రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి, వెనుక కూర్చొని పెట్టుకోని వారికి, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్కు ₹1000, ఇన్సూరెన్స్ లేకపోతే ₹2000(తొలిసారి), రెండోసారి ₹4000, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ₹5000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వారికి ₹1500, ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే ₹1500 ఫైన్ వేస్తామని పోలీసులు హెచ్చరించారు.
News February 28, 2025
సెమీస్కు ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 274 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109 పరుగులు చేయగా మ్యాచుకు వర్షంతో ఆటంకం కలిగింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రాగా నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది.