News August 9, 2025

విషాదం: రాఖీ కట్టి వస్తుండగా ప్రమాదం.. అక్క మృతి

image

TG: రాఖీ రోజున విషాదం చోటు చేసుకుంది. తమ్ముడికి రాఖీ కట్టి పుట్టింటి నుంచి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అక్క చనిపోయింది. ములుగు జిల్లా నాంపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి కిండపడటంతో పద్మ అక్కడికక్కడే మరణించింది. భర్తకు స్వల్పగాయాలయ్యాయి. కాగా పద్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Similar News

News August 9, 2025

PHOTOS: సెలబ్రిటీస్ రాఖీ సెలబ్రేషన్స్

image

రాఖీ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంబరాల్లో పాల్గొన్నారు. పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు రాఖీ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రకుల్ ప్రీత్, జెనీలియా, నిహారిక, సారా అలీ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News August 9, 2025

మూడు విడతల్లో వేతనాల పెంపు: నిర్మాతలు

image

సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. వేతనం రూ.2వేల(రోజుకు) లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే 30శాతం పెంపునకు సుముఖంగా లేమని తెలిపారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5, మూడో విడతలోనూ 5% పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్పష్టం చేశారు. ఇక కార్మిక ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు.

News August 9, 2025

వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వండి: బొత్స

image

AP: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని, ఆ సమయంలో కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘జగన్ సీఎం అయ్యాకే కేసును సీబీఐకి అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలి. విశాఖ భూదోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని వెనుక పెద్దల హస్తం ఉంది’ అని బొత్స ఆరోపించారు.