News September 3, 2024

విషాదం: తండ్రీకొడుకును మింగేసిన బుడమేరు

image

AP: బుడమేరు వరద విజయవాడ ప్రజల జీవితాల్లో విషాదాన్ని నింపింది. దాని ఉద్ధృతికి తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. గుణదలకు చెందిన వెంకటేశ్వరరావు(63), ఆయన కుమారుడు సందీప్(35) ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్లినవారు సోమవారం ఉదయానికీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు అక్కడికెళ్లి చూడగా వరద నీటిలో వారిద్దరి మృతదేహాలు కనిపించాయి.

Similar News

News October 14, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్

image

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్‌షిప్‌ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్‌షిప్ అందిస్తోంది. ఇంటర్‌లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్‌సైట్: <>https://ruparahulbajajscholarship.bajajauto.co.in/<<>>

News October 14, 2025

బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. కాగా 243 స్థానాల్లో 101 సీట్ల చొప్పున పోటీ చేయాలని ఇప్పటికే BJP, JDU నిర్ణయించుకున్నాయి. మిగిలిన సీట్లను ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలకు కేటాయించాయి.

News October 14, 2025

విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం

image

APలోని విశాఖలో గూగుల్ AI హబ్‌ లాంచ్ అవడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. AI, టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తిమంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుంది’ అని ట్వీట్ చేశారు.