News September 28, 2024
విషాదం.. ఆవును కాపాడబోయి నలుగురు మృతి

ప.బెంగాల్లోని జల్పాయిగుడి జిల్లాలో విషాదం జరిగింది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. నిన్న ఇంటి బయట నీటిలో పడి ఉన్న కరెంట్ వైర్ ఆవుకు తగలడంతో మిథున్ (32) దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అతడికి షాక్ తగలడంతో తండ్రి పరేష్ (60), దీపాలి తల్లి (55) కాపాడేందుకు ప్రయత్నించారు. ఇలా ఆ ముగ్గురూ షాక్తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మనవడు సైతం ప్రాణాలు వదిలాడు.
Similar News
News September 18, 2025
అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు: సీఎం చంద్రబాబు

AP: కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి. సంస్కరణలు అంటే నేనెప్పుడూ ముందుంటా. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.
News September 18, 2025
GST సంస్కరణలకు మద్దతిచ్చిన తొలి రాష్ట్రం ఏపీ: పవన్

AP: GST సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయని Dy.CM పవన్ అన్నారు. అసెంబ్లీలో GST సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘GST తగ్గింపుతో అల్పాదాయ వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జీఎస్టీ సంస్కరణల్లో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించా. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించాం. చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీ’ అని పవన్ తెలిపారు.
News September 18, 2025
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు లక్షణాలు

మొక్కజొన్నలో పూత దశ తర్వాత నేలలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల బొగ్గు కుళ్లు తెగులు కనిపిస్తుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపించి గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వల్ల పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇలాంటి మొక్కలను చీల్చి చూసినపుడు లోపల బెండు భాగం కుళ్లి, తెలుపు రంగు నుంచి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.