News October 26, 2025

విషాదం: మట్టిపెళ్లలు విరిగిపడతాయని పంపిస్తే..

image

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దంపతులను దురదృష్టం వెంటాడింది. NH-85 విస్తరణ పనుల్లో భాగంగా మన్నంకందంలో కొండను తవ్వుతున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని 22 కుటుంబాలను నిన్న సాయంత్రం రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అయితే రాత్రికి భోజనం కోసం బిజు(48), సంధ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో మట్టి, బురద ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. బిజు చనిపోగా, సంధ్య తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News October 26, 2025

జూబ్లీహిల్స్‌లో సీఎం ప్రచార షెడ్యూల్ ఖరారు

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. డివిజన్ల వారీగా ఈనెల 30, 31 తేదీల్లో తొలి విడత, NOV 4, 5 తేదీల్లో రెండో విడత ప్రచారం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ కుమారుడి బారసాల ఉత్సవంలో పాల్గొని ఆశీర్వదించారు. ఇవాళ రాత్రికి రేవంత్ HYD చేరుకోనున్నారు.

News October 26, 2025

అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్

image

నిన్న ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరగొట్టిన రోహిత్ అరుదైన రికార్డు సాధించారు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్‌గా నిలిచారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించారు. రోహిత్ 15,787 రన్స్ చేయగా, ఆ తర్వాత సెహ్వాగ్ (15,758), సచిన్ (15,335) పరుగులు చేశారు. రోహిత్ 2007లోనే భారత్ తరఫున అరంగేట్రం చేసినా అంతగా రాణించలేదు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తాక రికార్డులు కొల్లగొట్టారు.

News October 26, 2025

మొంథా తుఫాను.. ప్రజలకు జగన్ సూచనలు

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని YCP అధినేత జగన్ సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలను NOV 4కు వాయిదా వేసినట్లు వైసీపీ వెల్లడించింది.