News July 26, 2024
మేడారంలో విషాదం.. మరో పూజారి మృతి

TG: ములుగు(D) మేడారంలో పూజారులు మృతిచెందడం విషాదాన్ని నింపుతోంది. వారం రోజుల కిందట సమ్మక్క పూజారి ముత్తయ్య అనారోగ్యంతో చనిపోగా, ఇవాళ సారలమ్మ పూజారి కాకా సంపత్ మృతిచెందారు. కన్నెపల్లికి చెందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 5 నెలల క్రితం దశరథం అనే పూజారి, దాదాపు ఏడాది క్రితం అతని సోదరుడు లక్ష్మణరావు కూడా అనారోగ్యంతోనే చనిపోయారు. ఏడాదిన్నర కాలంలోనే మొత్తం నలుగురు పూజారులు కన్నుమూశారు.
Similar News
News December 3, 2025
ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వచ్చినా, స్పాంటింగ్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్ కాదు. కాబట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఏ గుడికి వెళ్లినా లడ్డూ, పులిహోరాలనే ప్రసాదాలుగా ఇస్తారు. కానీ గుజరాత్లోని రపుతానా(V)లో జీవికా మాతాజీ, తమిళనాడులోని పడప్పాయ్ దుర్గా పీఠం ఆలయాల్లో మాత్రం పిజ్జా, బర్గర్, పానీపురి, కూల్ డ్రింక్స్ను ప్రసాదంగా పంచుతారు. దేవతలకు కూడా వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు ప్రస్తుత కాలంలో ఇష్టపడే ఆహారాన్ని దేవతలకు నివేదించి, వారికి సంతోషాన్ని పంచాలనే విభిన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
News December 3, 2025
NCSSRలో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ (<


