News March 19, 2024
విషాదం: గుండెపోటుతో టెన్త్ విద్యార్థిని మృతి

AP: వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొర్రపాడులో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది. నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది. వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News August 28, 2025
భారత్తో వైరం.. ట్రంప్పై హౌస్ డెమోక్రాట్స్ ఫైర్

భారత్పై ట్రంప్ టారిఫ్స్ విధించడాన్ని అమెరికన్లు సైతం తప్పుపడుతున్నారు. తాజాగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ‘రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టారిఫ్స్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. US-భారత్ సంబంధాలను దెబ్బతీస్తున్నారు. అమెరికన్స్కు నష్టం జరుగుతోంది. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News August 28, 2025
మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TGలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నల్గొండ, యాదాద్రి, KNR, ఖమ్మం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. <<17538468>>ఇప్పటికే<<>> కామారెడ్డి, MDK, నిర్మల్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.
News August 28, 2025
కామారెడ్డిలో మళ్లీ మొదలైన వర్షం

TG: కామారెడ్డిలో తెల్లవారుజాము నుంచే ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. GRకాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.