News August 20, 2024

స్పామ్ కాల్స్‌ నియంత్రణకు TRAI కీలక ఆదేశాలు

image

టెలీ మార్కెటింగ్ కాల్స్‌(14 సిరీస్‌తో ప్రారంభమయ్యే)ను బ్లాక్ చెయిన్ సాయంతో పని చేసే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీకి మార్చాలని టెలికం కంపెనీలను TRAI ఆదేశించింది. ఇందుకు SEP 30ని గడువుగా నిర్దేశించింది. SEP 1 నుంచి వెబ్‌సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన మెసేజ్‌లు పంపకూడదని ఆదేశాల్లో పేర్కొంది. గుర్తు తెలీని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను NOV 1 నుంచి పూర్తిగా ఆపేయాలంది.

Similar News

News October 11, 2025

విషపూరిత దగ్గు మందు.. తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: CDSCO

image

మధ్యప్రదేశ్‌లో 23 మంది పిల్లల మరణాలకు తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పేర్కొన్నట్లు NDTV తెలిపింది. కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసే ‘Sresan’ కంపెనీలో తనిఖీలు చేయలేదని, దీనివల్ల ఆ విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి వచ్చిందని చెప్పింది. ఆ సంస్థలో అసలు ఆడిట్ జరగలేదని, సెంట్రల్ పోర్టల్‌లోనూ రిజిస్టర్ కాలేదని వెల్లడించింది.

News October 11, 2025

పర్యాటకంలో గోవా, సిమ్లాలను దాటిన కాశీ

image

ఈశ్వరుడు కొలువైన పురాతన కాశీ నగరం నేడు సంప్రదాయ పర్యాటక కేంద్రాలైన గోవా, సిమ్లాలను అధిగమించింది. కేవలం ఆధ్యాత్మిక రాజధానిగా మాత్రమే పరిగణించే వారణాసి, ఇప్పుడు భారత పర్యాటక రంగానికే పునర్నిర్వచనం ఇస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2024లో 11 కోట్లకు పైగా పర్యాటకులు వారణాసిని సందర్శించారు. 2025లో తొలి 6 నెలల్లోనే ఈ సంఖ్య 13 కోట్లకు చేరింది. 2021లో కేవలం కాశీ పర్యాటకుల సంఖ్య 30.7 లక్షలుగా ఉంది.

News October 11, 2025

ధనధాన్య కృషి యోజన పథకం ప్రారంభం

image

దేశంలోని వ్యవసాయ రంగ ఉత్పాదకతను పెంచేందుకు ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ సగటుకంటే పంట ఉత్పాదకత తక్కువ ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో సాగునీటి సామర్థ్యం, పంట నిల్వ, రుణ సదుపాయం, పంటమార్పిడి, సాగులో వైవిధ్యం పెంచడానికి కేంద్రం ఏటా రూ.24 వేల కోట్ల చొప్పున ఆరేళ్లు ఖర్చు చేస్తుంది. దీని వల్ల 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.