News December 10, 2024
రైలు ఆలస్యం.. గమ్యాన్ని చేరేందుకు మూడేళ్లు పట్టింది!

ఇండియాలో రైళ్లు ఆలస్యంగా నడవటం కామన్. ఒక్కోసారి 4 గంటల్లో గమ్యాన్ని చేరే రైలు.. అనుకోని కారణాలతో 8 గంటలూ పట్టొచ్చు. కానీ, విశాఖ నుంచి UPలోని బస్తీకి DAP బస్తాలతో బయల్దేరిన ఓ గూడ్స్ గమ్యాన్ని చేరేందుకు ఏకంగా మూడేళ్ల ఎనిమిది నెలలు పట్టింది. దీంతో దేశంలో అత్యంత ఆలస్యంగా గమ్యాన్ని చేరిన రైలుగా రికార్డులకెక్కింది. కాగా 2014 నవంబర్లో బయల్దేరిన ఈ రైలు ప్రమాదం కారణంగా 2018 జులై 25న గమ్యాన్ని చేరుకుంది.
Similar News
News November 24, 2025
UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
News November 24, 2025
VIRAL: ట్రంప్ జూనియర్తో రామ్ చరణ్

US ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుక ఉదయ్పూర్లోని రాజభవనంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.


