News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News February 5, 2026

అబద్ధాలు కాదు.. చేసింది చెబితే చాలు: CM

image

TG: పట్టణ ప్రాంతాల్లోని పథకాలు, చేకూర్చిన లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలను నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, టికెట్ రానివారిని కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని, చేసింది చెప్పాలని తెలిపారు. రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామన్నారు.

News February 5, 2026

NIT జలంధర్‌ 101 పోస్టులకు నోటిఫికేషన్

image

<>డాక్టర్<<>> B R అంబేడ్కర్ NIT జలంధర్ 101 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు ఫిబ్రవరి 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, ME, MTech, MBA, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwBD, మహిళలకు రూ.1,000. ప్రజెంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitj.ac.in

News February 5, 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 133.20 పాయింట్లు నష్టపోయి 25,642.80 వద్ద, సెన్సెక్స్ 503.76 పాయింట్లు కోల్పోయి 83,313.93 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ ప్రారంభంలో 25,755.90 వద్ద ఉన్న నిఫ్టీ ఒక దశలో 25,579.50కి పడిపోయినా తరువాత కాస్త కోలుకుంది. ట్రెంట్, టాటా స్టీల్, SBIN, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడయ్యాయి.