News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News January 28, 2026

2.0లో కార్యకర్తలకు టాప్‌ ప్రయారిటీ: జగన్

image

AP: దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ CM జగన్ పేర్కొన్నారు. ‘ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా. 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. CBN తప్పుడు పాలనను ప్రజలకు వివరిద్దాం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా పార్టీనేతలు చొరవ చూపాలి. క్రితంసారి కొవిడ్‌ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ఇది నా హామీ’ అని జగన్ వివరించారు.

News January 28, 2026

తన జీతం ఎంతో చెప్పిన SBI PO.. నెట్టింట చర్చ!

image

తన జీతం గురించి ఓ SBI PO చెప్పిన విషయాలు నెట్టింట చర్చకు దారితీశాయి. ‘2022లో PO(ప్రొబెషనరీ ఆఫీసర్)గా ఎంపికయ్యా. నా జీతం ₹95 వేలు. 2.5 ఏళ్లలో 5 ఇంక్రిమెంట్లు వచ్చాయి’ అని తెలిపారు. అలవెన్సుల కింద మరో ₹29 వేలు వస్తాయని చెప్పారు. 2.5ఏళ్లకే ₹లక్షకు పైగా జీతం వస్తే రిటైర్మెంట్ టైమ్‌కు ఇంకెంత వస్తుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు అభినందిస్తుండగా, ఇది ఎలా సాధ్యమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

News January 28, 2026

సంజూకు ఇది చివరి అవకాశమా?

image

IND T20 ఓపెనర్ శాంసన్‌కు ఇవాళ NZతో జరిగే 4వ T20 చివరి అవకాశమని క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. తొలి 3 టీ20ల్లో 16 పరుగులే చేసిన అతనిపై ఇషాన్ కిషన్ రూపంలో కత్తి వేలాడుతోందని చెబుతున్నాయి. అటు తొలి 2 మ్యాచుల్లో విఫలమైనా 3వ దాంట్లో రాణిస్తాడనుకుంటే డకౌట్ అయ్యారు. ఇదే టైమ్‌లో కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇవాళ సంజూ మరోసారి నిరాశపరిస్తే ఇషాన్ ఓపెనర్‌గా, తిలక్ నం.3లో ఫిక్స్ అవుతారనే చర్చ నడుస్తోంది.