News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News February 8, 2026
రక్తస్రావాన్ని క్షణాల్లో ఆపేసే స్ప్రే!

ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో రక్తస్రావం వల్లే ఎక్కువగా ప్రాణాలు పోతుంటాయి. ఈ క్రమంలో బ్లీడింగ్ను ఆపే ‘స్ప్రే ఆన్ పౌడర్’ను దక్షిణ కొరియాలోని KAIST సైంటిస్టులు కనుగొన్నారు. రక్తాన్ని తాకగానే బలమైన జెల్గా మారి, గాయాన్ని సీల్ చేసేలా అభివృద్ధి చేశారు. ఇందులో వాడిన పదార్థాలు ప్రకృతి నుంచి తీసుకున్నవే కావడం గమనార్హం. సైనికులను కాపాడాలని తాను ఈ రీసెర్చ్ చేసినట్లు సైంటిస్ట్ క్యుసూన్ పార్క్ తెలిపారు.
News February 8, 2026
భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైక్ ధరలు!

ఇండియాతో ట్రేడ్ డీల్ నేపథ్యంలో USకు చెందిన కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయి. 800-1600CC ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్స్పై ఎలాంటి టారిఫ్స్ ఉండవని అధికారులు తెలిపారు. దీంతో హార్లే డేవిడ్సన్ బైకు ధరలు భారీగా తగ్గనున్నాయి. గతేడాది 1600CC లోపు వాహన దిగుమతులపై 50%గా ఉన్న టారిఫ్స్ను 40%కు కేంద్రం తగ్గించింది. తాజాగా 3000 CC కంటే ఎక్కువ సామర్థ్యమున్న హైఎండ్ కార్లపై టారిఫ్స్ను 110% నుంచి 30%కు కుదించింది.
News February 8, 2026
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. UPDATE

TG: యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకై RBIకి రూ.9వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇండెంటు పెట్టింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 21 ఏళ్లతో రూ.2,500 కోట్లు, 27 ఏళ్లతో రూ.2,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ నెల 10న ఈ రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా(ఎకరాకు రూ.6,000) ఇస్తామని CM ప్రకటించిన సంగతి తెలిసిందే.


