News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News January 28, 2026
బ్లాక్ బాక్స్తో తెలియనున్న ప్రమాద కారణాలు!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సిందే. విమానం వేగం, ఇంధనం వంటి దాదాపు 80 రకాల సాంకేతిక అంశాలను ఇది రికార్డు చేస్తుంది. పైలట్ల మాటలు, కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన సూచనలు, కాక్పిట్లో వినిపించే శబ్దాలను ఇది భద్రపరుస్తుంది. ప్రస్తుతం అధికారులు బ్లాక్ బాక్స్ను వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
News January 28, 2026
మేడారం గద్దెల వరకు RTC బస్సులు: పొన్నం

TG: మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘భక్తుల కోసం RTC 4వేల బస్సులు నడుపుతోంది. అక్కా చెల్లెళ్లు ఫ్రీగా ప్రయాణించొచ్చు. బస్సులు అమ్మవారి గద్దెల ప్రాంగణం వరకు భక్తులను తీసుకెళ్తాయి. తాగునీరు, హెల్త్ క్యాంప్స్, మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్, 9KM పొడవైన 50 క్యూలైన్లలో ఒకేసారి 20 వేల మంది ప్రయాణికులు నిలిచేలా ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.
News January 28, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

* నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్లో ఉంచితే మరో 2 రోజులు వాడుకోవచ్చు. * నీళ్ళలో పచ్చిపాలు కలిపి వెండి సామగ్రి కడిగితే మురికి వదిలిపోయి శుభ్రపడతాయి. * బెండకాయ కూరలో కాస్త పెరుగు/ నిమ్మరసం జోడిస్తే జిగురు రాకుండా ఉంటుంది. * పిండిలో పావుకప్పు వేయించిన సేమియా వేస్తే గారెలు మరింత రుచిగా ఉంటాయి. *అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.


