News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News February 5, 2026
అబద్ధాలు కాదు.. చేసింది చెబితే చాలు: CM

TG: పట్టణ ప్రాంతాల్లోని పథకాలు, చేకూర్చిన లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలను నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, టికెట్ రానివారిని కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని, చేసింది చెప్పాలని తెలిపారు. రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామన్నారు.
News February 5, 2026
NIT జలంధర్ 101 పోస్టులకు నోటిఫికేషన్

<
News February 5, 2026
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 133.20 పాయింట్లు నష్టపోయి 25,642.80 వద్ద, సెన్సెక్స్ 503.76 పాయింట్లు కోల్పోయి 83,313.93 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్ ప్రారంభంలో 25,755.90 వద్ద ఉన్న నిఫ్టీ ఒక దశలో 25,579.50కి పడిపోయినా తరువాత కాస్త కోలుకుంది. ట్రెంట్, టాటా స్టీల్, SBIN, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడయ్యాయి.


