News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News February 3, 2026

మైతేయి-కుకీ హింస.. CM రిజైన్.. మణిపుర్‌లో ఏం జరిగింది?

image

మణిపుర్‌లో 2023 మేలో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన హింస రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు 250 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాన్ని కంట్రోల్ చేయలేక, సొంత పార్టీ నేతల విమర్శల మధ్య 2025 Feb 9న అప్పటి CM బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో 2025 ఫిబ్రవరి 13 నుంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఏడాది తర్వాత నేడు BJP <<19041653>>కొత్త సీఎం<<>>ను ఎన్నుకుంది.

News February 3, 2026

మజ్లిస్ పార్టీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కన్నుమూత!

image

AIMIM జనరల్ సెక్రటరీ, మాజీ MLA సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన HYDలోని ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 4సార్లు MLAగా (చార్మినార్-3, యాకుత్‌పుర-1) పనిచేసిన ఖాద్రీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి అత్యంత ఆప్తుడిగా పేరొందారు. ఆయన మృతి పట్ల అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News February 3, 2026

ఇది ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ: రాహుల్ గాంధీ

image

ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశ భద్రత ముఖ్యమైన అంశమని, దీనిపై సభలో మాట్లాడనివ్వకుండా హక్కులను కాలరాశారని విమర్శించారు. ఓ ప్రతిపక్ష నేతకు ఇలా జరగడం పార్లమెంటు చరిత్రలో తొలిసారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంపై ఒక మాయని మచ్చ అని లేఖలో పేర్కొన్నారు.