News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News February 12, 2026
హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 220 పోస్టులు

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతతో పాటు పనిఅనుభవం వారు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. సైట్: avnl.co.in
News February 12, 2026
అరటిలో తొండం కుళ్లు తెగులు – నివారణ

సూర్యరశ్మి తాకిడికి అరటి గెల తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపి అక్కడ కుళ్లు ఏర్పడుతుంది. గెలబరువు పెరిగినపుడు కుళ్లిన తొండం విరిగి గెలపడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు సరిగా తయారుకావు. ఈ సమస్య నివారణకు తొండంపై అరటి ఆకులు చుట్టినట్లయితే వాటిపై ఎండు మచ్చలు ఏర్పడవు. మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా లీటరు నీటికి కార్బండిజమ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 12, 2026
మహాశివరాత్రి ఎప్పుడు?

మాఘ మాసం బహుళ చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకొంటారు. ఈ ఏడాది ఈ తిథి ఫిబ్రవరి 15న 5.05PMకు ప్రారంభమై మరుసటి రోజు 5.34PMకు ముగుస్తుంది. దీనిప్రకారం FEB 15న పండుగ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. శివుడి పూజకు నిషిత కాలంలో అంటే రాత్రి 11.55 నుంచి 12.56 వరకు మంచి సమయమంటున్నారు. గంగాజలంతో లేదా పంచామృతాల(పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర)తో లింగానికి అభిషేకం చేస్తే శుభప్రదమంటున్నారు.


