News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News December 15, 2025

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్‌లైన్‌ క్లాసులు

image

ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీరందరికీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. అన్ని పాఠశాలలు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 228 విమానాలు రద్దయ్యాయి.

News December 15, 2025

PPP విధానమే బెస్ట్: చంద్రబాబు

image

AP: ప్రజలను మభ్య పెట్టేందుకు మెడికల్ కాలేజీల అంశాన్ని కొందరు <<18575709>>రాజకీయం<<>> చేస్తున్నారని సీఎం <<18575135>>చంద్రబాబు<<>> విమర్శించారు. మెరుగైన చదువు, సేవలు కావాలంటే పీపీపీనే సరైన విధానమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసిందన్నారు. పీపీపీ విధానంలోనే రహదారులు, ఎయిర్ పోర్టులు వంటి సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు 18 నెలల్లోనే రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు.

News December 15, 2025

14 గంటలు, 28 ఆర్డర్లకు రూ.762.. వైరల్

image

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ తన రోజువారీ సంపాదనపై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒక రోజులో 28 ఆర్డర్లు డెలివరీ చేసి ఇన్సెంటివ్స్‌తో కలిపి రూ.762 సంపాదించానని తెలిపాడు. ఇందుకోసం 14 గం. కష్టపడ్డానని చెప్పాడు. అయితే ఇది చాలా తక్కువ సంపాదన అని, బ్లింకిట్ శ్రమ దోపిడీకి పాల్పడుతోందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. క్విక్ కామర్స్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని మరికొందరు అంటున్నారు. COMMENT?