News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News December 29, 2025
రేపే వైకుంఠ ఏకాదశి.. ఇలా చేస్తే ఎంతో పుణ్యం

ధనుర్మాసం ఎంతో శక్తిమంతమైనది. వైకుంఠ ఏకాదశి నాడు ఈ వైభవం రెట్టింపవుతుంది. ఈ పవిత్ర దినాన భక్తులు చేసే ఉపవాసం శారీరక, మానసిక శుద్ధిని ఇస్తుంది. రాత్రంతా హరినామ స్మరణతో చేసే జాగరణ అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తెల్లవారుజామునే పురుషోత్తముణ్ని దర్శించుకోవడం వల్ల జన్మ ధన్యమవుతుంది. భక్తిశ్రద్ధలతో విష్ణువును ఆరాధించే వారికి సకల పాపాలు తొలగి, చివరకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
News December 29, 2025
రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్లు

ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ <<18699122>>ప్రమాదం<<>>తో ఎలమంచిలి రైల్వే స్టేషన్లో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యం కానున్నాయి. అనకాపల్లి, తుని, విశాఖ తదితర రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రయాణికులు ప్రస్తుతం స్టేషన్లో ఉన్నారు.
News December 29, 2025
వైకుంఠ ఏకాదశి రోజున ఆ పని చేయకూడదు.. ఈరోజే చేసుకోండి!

రేపు వైకుంఠ ఏకాదశి. ఇది అతి పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ పర్వదినాన తులసి ఆకులను కోయడం నిషిద్ధం. తులసి కోటను ముట్టడం, ఆకులు తెంపడం మంచిది కాదు. అందుకే స్వామికి రేపు సమర్పించాల్సిన తులసి దళాలను ఈరోజే కోసి సిద్ధం చేసుకోండి. తులసి ఎప్పుడు తెంపినా వాటి పవిత్రత తగ్గదు. నిశ్చింతగా పూజకు వాడుకోవచ్చు. నియమాలు పాటిస్తూ భక్తితో ఆ శ్రీహరిని స్మరించి, అర్చించి మోక్షాన్ని పొందండి.


