News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News February 7, 2026

ధనప్రాప్తి కలగాలంటే ఏం చేయాలంటే?

image

ధనప్రాప్తి కలగడానికి కొన్ని ఆచారాలు పాటించాలి. రోజూ పూజ చేసే సమయంలో ‘శ్రీ సూక్తం’ పఠించాలి. అమ్మవారిని ఉపాసిస్తూ ఓ లవంగాన్ని ఆమె వద్ద ఉంచడం శుభప్రదం. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ప్రతి శనివారం విరిగిన వస్తువులను పారేసి, బూజు దులపాలి. పూజ గదిలో ‘ఏకాక్షి కొబ్బరికాయ’ ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులను చూసుకుని కళ్లకు అద్దుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

News February 7, 2026

క్రేజీ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ

image

ఈ నగరానికి ఏమైంది(ENE) సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత ‘కీడా కోలా’ చేసినా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. దర్శకుడిగా చేస్తూనే నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ‘ENE2’ మూవీ చేస్తున్న తరుణ్ హీరోగా ఓ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్‌ను క్రేజీ డైలాగ్ ‘గాయపడ్డ సింహం’గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 9న టీజర్ విడుదల కానుందని పేర్కొన్నారు.

News February 7, 2026

అర్ధరాత్రి బిహార్ ఎంపీ అరెస్ట్

image

నాటకీయ పరిణామాల నడుమ బిహార్ ఎంపీ పప్పూ యాదవ్(రాజేశ్ రంజన్) అరెస్టయ్యారు. 1995 డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులో ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పోలీసులతో అరెస్టుకు వారెంట్ లేదని వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఢిల్లీ నుంచి పాట్నాలోని ఇంటికి చేరిన గంటలోపే పప్పూను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.