News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News February 4, 2026

గడాఫీ కుమారుడి హత్య

image

లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ(53)ని దుండగులు హత్య చేశారు. జింటాన్‌లోని ఇంటిపై నలుగురు సాయుధులు దాడి చేసి హతమార్చినట్లు ఆయన అడ్వైజర్ అబ్దుల్లా వెల్లడించారు. తన తండ్రి హయాంలో ఇస్లాం ఎలాంటి పదవి చేపట్టకపోయినా మితవాది, సంస్కర్త అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 2011 తిరుగుబాటులో గడాఫీ హతమైన తర్వాత 2021లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

News February 4, 2026

వరిలో ఈ తెగుళ్లు కనిపిస్తున్నాయా? నివారణ ఎలా?

image

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి ఎక్కువైంది. ప్రధానంగా వరిలో మానిపండు తెగులు, పాముపొడ(మాగుడు) తెగులు, రెల్లరాల్చు పురుగు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 4, 2026

CSK అభిమానులకు గుడ్‌న్యూస్

image

IPLలో అత్యంత విజయవంతమైన CSK ఫ్రాంచైజీ త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ CEO కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఇది భవిష్యత్తు ప్రణాళికలో భాగమని, మహిళల క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత WPL 2026 సీజన్ ముగింపు దశకు వచ్చింది. రేపు వడోదరలో జరిగే ఫైనల్‌లో ఢిల్లీ టీమ్ RCBతో తలపడనుంది. ప్రస్తుతం WPLలో 5 జట్లు పాల్గొంటున్నాయి.