News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

Similar News

News January 31, 2026

సూర్యలానే సంజూను బ్యాకప్ చేయాలి: రైనా

image

NZతో జరుగుతున్న T20 సిరీస్‌లో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సంజూకు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచారు. కెప్టెన్ సూర్యకుమార్ ఏడాది పాటు రన్స్ చేయలేకపోయినా టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని బ్యాకప్ చేసిందని చెప్పారు. సంజూ విషయంలోనూ ఇలాగే జరగాలన్నారు. అతనికి అవకాశాలు ఇస్తూ ఉంటే కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారని రైనా అభిప్రాయం వ్యక్తం చేశారు. NZతో జరిగిన తొలి 4 T20ల్లో సంజూ 40 పరుగులే చేశారు.

News January 31, 2026

ఒక అబద్ధానికి పుట్టిన మహా అబద్ధం: YCP

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని YCP వాదిస్తోంది. మరోవైపు ‘మహా పాపం నిజం’ అని పలు ప్రాంతాల్లో TDP ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో YCP చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. ‘ఒక అబద్ధానికి పుట్టిన మహా అబద్ధం నారా లోకేశ్’ అంటూ CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను టార్గెట్ చేసింది.

News January 31, 2026

అదానీకి అమెరికా ‘సమన్ల’ సెగ!

image

గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన ఫ్రాడ్ కేసులో విచారణకు అడ్డంకి తొలగిపోయింది. ఇన్నాళ్లూ సమన్లు అందలేదన్న టెక్నికల్ ఇష్యూతో ఆగిపోయిన ఈ కేసు ఇప్పుడు ముందుకు సాగనుంది. కోర్టు పత్రాలను స్వీకరించేందుకు USలోని ఆయన న్యాయవాదులు అంగీకరించారు. Adani Green Energy కోసం భారత అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై SEC ఈ సివిల్ కేసు వేసింది. దీనిపై స్పందించేందుకు కోర్టు వారికి 90 రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది.