News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News January 27, 2026
పార్వతీపురం: CISF జవాన్ సూసైడ్..!

మన్యం జిల్లా జియ్యమ్మవలసలోని కన్నపుదొరవలసకు చెందిన CISF హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ (42) బెంగళూరులో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. సోదరుడు గంగునాయుడు తెలిపిన వివరాల మేరకు.. 2009 నుంచి బెంగళూరు ఎయిర్ పోర్ట్లో విధులు నిర్వహిస్తున్నాడని, అక్కడే స్థిర నివాసం కూడా ఏర్పరచుకున్నాడన్నారు. ఏమైందో తెలియదు ఆదివారం సాయంత్రం రైలు పట్టాలపై సూసైడ్ చేసుకున్నాడని కన్నీరు మున్నీరై విలపిస్తున్నాడు.
News January 27, 2026
ఈ వారం కూడా నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ భయాలు దేశీయ స్టాక్ మార్కెట్లను వదలడం లేదు. గత వారం భారీ నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ కూడా రెడ్లోనే మొదలయింది. ప్రస్తుతం 400 పాయింట్లకు పైగా కోల్పోయి 81,132 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 24,900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మహీంద్రా&మహీంద్రా, కోటక్, ఎటర్నల్, మారుతీ, HDFC, రిలయన్స్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
News January 27, 2026
హనుమంతుడికి యాలకులు సమర్పిస్తే..

భక్తులకు కొండంత ధైర్యాన్నిచ్చే హనుమాన్కు యాలకులను నైవేద్యంగా పెడితే విశేష ఫలితాలుంటాయని పండితుల వాక్కు. వాటిని స్వామికి నివేదిస్తే దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. ‘అలాగే పేదరికాన్ని తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. సమర్పించిన యాలకులను భద్రంగా దాచుకుంటే శని దోషాలు తొలగి కెరీర్లో మంచి మార్పులు వస్తాయి’ అంటున్నారు.


